Balagam Fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికి కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు గుర్తింపు వచ్చింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వ కు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత యిస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగిన వాళ్ళు వుండాల్సిందే అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి .
భర్త, కొడుకు మరణం బాధించింది….
విజయలక్ష్మి గారు సురభి కళాకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. హారికథ కూడా చెప్పే విజయలక్ష్మి గారు చాలా కాలంగా అవన్నీ వదిలేసి కాలం గడుపుతున్నారు. చేగుంట లో ముప్పై ఏళ్లకు పైగా ఉన్న విజయలక్ష్మి గారు అక్కడే పిల్లలను పెద్ధ చేసి పెళ్లిళ్లి కూడా చేశారట. ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు కాగా పెద్ద కొడుకు పెళ్లి కూడా చేయక ముందే భర్త మరణించారట. ఆ తరువాత పిల్లలు పెళ్లిళ్లు చేసేసి వారితో ఉంటున్న సమయంలో కొడుకు మరణించడం తట్టుకోలేక పోయారట విజయలక్ష్మి.
రెండో కొడుకు మరణించే సమయానికి కోడలు గర్భవతిగా ఉందట. ఇక కొడుకు మరణంతో అక్కడ ఉండలేక హైదరాబాద్ లోని సురభి కాలనీకి వచ్చేసారట విజయలక్ష్మి. అయితే మళ్ళీ నాటకాలు, హారికథ చెప్పమని తన తోటి వారు ప్రోత్సహించిన తనకు బ్యాక్ పెయిన్ ఉండటం వలన చేయలేకపోయారట. ఇక సురభి కాలనీ కే వేణు గారు వచ్చి బలగం కోసం ఆడిషన్ తీసుకోవడం తో ఊరికే ప్రయత్నిద్ధం అని చేయాగ సెలెక్ట్ అయ్యానని నేడు తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునేలా మంచి పాత్ర చేసానని ఇందుకు కారణం డైరెక్టర్ వేణు అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…