Balakrishna: నందమూరి తారకరత్న మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తోంది. ఒకవైపు నందమూరి ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీస్తోంది.గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నప్పటికీ క్షేమంగా బయటకు రాలేకపోయారు.
ఇలా మృత్యువుతో పోరాడుతూ చివరికి విధి చేతిలో తారకరత్న ఓడిపోయి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇక తారకరత్న మరణ వార్త నందమూరి నటసింహం బాలకృష్ణకు తీవ్ర విషాదంగా మిగిలిపోయింది.చిన్నప్పటినుంచి తారకరత్నతో బాలకృష్ణకు ఎంతో మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమాభిమానాలను చూపుకుంటారు..
ఈ విధంగా బాబాయ్ అబ్బాయి మధ్య ఎంతో ప్రేమ ఉండడంతో తారకరత్న కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడుతూ ఎలాగైనా తనని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు. అయితే చివరికి బాలకృష్ణ తారకరత్న మరణ వార్త విని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక తారకరత్న మరణంతో బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తారకరత్న అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన మరణించడంతో తారకరత్న పిల్లల బాధ్యతలను పూర్తిగా బాలకృష్ణ తన చేతులలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా తెలియజేశారు.తన పిల్లలకు ఏ లోటు లేకుండా వారి బాధ్యతలను తానే చూసుకుంటానంటూ బాలయ్య హామీ ఇవ్వడంతో బాలయ్య మనసు బంగారం అంటూ అభిమానులు బాలయ్య నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…
సినిమాల్లో యాంగ్రీమ్యాన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…