Balakrishana: రిపోర్టర్ పై గాడిద అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే!
Balakrishana: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన అంటే చాలామంది భయపడతారు.ఎందుకంటే బాలయ్య బాబుకి కోపం వస్తే ముందు ఎవరున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వారికి గూబ పగిలి పోవాల్సిందే అనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇలా ఎన్నో సార్లు బయటకు వచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానుల పై చేయి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎంతోమంది రిపోర్టర్లు తనని వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ విసిగించినప్పుడు కూడా బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి పై తనదైన శైలిలో పంచ్ వేశారు.
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి అతనికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకొని ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బాలకృష్ణ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలని చెబుతున్న సమయంలో వెంటనే రిపోర్టర్ కలుగజేసుకొని వ్యక్తిగత దూరం కాదు సామాజిక దూరం సార్ అంటూ సమాధానం చెప్పారు. రిపోర్టర్ ఇలా చెప్పేసరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలయ్య సామాజికం కాదు గాడిద వ్యక్తిగతం సామాజికం అంటే ఏమిటి అంటూ తన పై పంచ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు బాలయ్యబాబు మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది లేదంటే రిపోర్టర్ చెంప చెల్లుమనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…