Categories: FeaturedMovie News

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు: బండ్ల గణేష్

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.రోడ్డు ప్రమాదం అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన స్పృహలోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎప్పటిలాగే బయటకు వెళ్ళిన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే సాయి ధరమ్ తేజ్ నటుడు నరేష్ కొడుకు నవీన్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరు తరచూ బైక్ రేసింగ్ లో పాల్గొనేవారు. అయితే శుక్రవారం కూడా నరేష్ ఇంటికి వెళ్లి అక్కడినుంచి బయలుదేరిన తరువాత సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఈ ప్రమాదంపై నరేష్ స్పందిస్తూ నేను ముందుగానే హెచ్చరించాను అంటూ సాయి తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేష్ వ్యాఖ్యలకు బండ్లగణేష్ స్పందించి ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి చిన్న ప్రమాదం జరిగింది ఎప్పటిలాగే ఆయన షూటింగ్లకు వెళ్తారు సినిమాలు తీస్తారు అంతా బాగుంటుంది. ఇలాంటి సమయంలో నటుడు నరేష్ గారూ మీరు ఎవరెవరో ప్రమాదంలో మరణించిన వారి పేర్లు చెప్పడం, వారి గురించి ఈ సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదు. అనవసరంగా సాయి ధరంతేజ్ రేసింగ్ చేశారని మా ఇంటి దగ్గరికి వచ్చారని ఇవన్నీ చెప్పడం తప్పు కదా సర్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ ఘాటుగా స్పందించారు.

ఇలాంటి క్లిష్ట సమయాలలో కేవలం ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి త్వరగా కోలుకోవాలని, సాయి ధరమ్ తేజ్ మునుపటిలాగే సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి సమయంలో ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి ముందు నేర్చుకోండి సార్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

14 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

24 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

36 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

45 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

1 hour ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago