అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి వేడుకలు ఉండడంతో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోడానికి గుడికి వెళ్తున్న రైతు కాలిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్ లోని కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అమరలింగేస్వర స్వామి రధోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ క్రమంలోనే ఎంపీ సురేష్ కూడా తన కాన్వాయ్ తో వెళుతున్నారు.
అదే సమయంలో వెలగపూడి, తుళ్లూరుకు చెందిన కొందరు రైతులు రధోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అయితే ఆలయానికి కొద్దిదూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నడిచి వెళ్ళమని చెప్పారు. దేనితో వారు ర్యాలీగా వెళ్తున్నారు. ఆసమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కారు.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో.. బస్సు తగ్గించే క్రమంలో రైతు కాలిపై ఎక్కింది… రైతు కాలికి తీవ్ర గాయం అవ్వడంతో తోటి రైతులంతా కలిసి హుటాహుటీన ఆసుపత్రి కి తీసుకెళ్లారు. కాలిపై కారు ఎక్కినా కూడా ఎంపీ సురేష్ కనీసం కారు ఆపకుండా వెళ్లిపోయారని మిగిలిన రైతులు మండిపడుతున్నారు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…