Featured

స్టేజీపైనే ఆ మంత్రికి హెయిర్ కట్టింగ్ చేసిన బార్బర్.. రూ.60 వేల బహుమానం!

అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఒక బార్బర్ ను చూస్తే ఈ మాట నిజమేనని అనిపిస్తుంది. ఒక బార్బర్ కు ఒక వ్యక్తికి కటింగ్, షేవింగ్ చేసినందుకు 60 వేల రూపాయలు దక్కింది. వినడానికి కొంత వింతగానే ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే కట్టింగ్ చేయించుకున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. అధికార పార్టీ మంత్రి అయిన సదరు వ్యక్తి కటింగ్, షేవింగ్ చేసిన బార్బర్ కళ్లల్లో ఆనందం నింపాడు.

పూర్తి వివరాల్లోకి వల్ల కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులు బహిరంగ సభలను ఏర్పాటు చేయడం లేదు. ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించినా వాటికి హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. కార్యక్రమాలకు హాజరైతే వైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం ఖండ్వా జిల్లా గులైమాల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు.

కార్యక్రమంలో భాగంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కీలక సూచనలు చేశాడు. ఆ సమయంలో రోహిదాస్ అనే బార్బర్ అక్కడికి వచ్చి కరోనా, లాక్ డౌన్ వల్ల తన పరిస్థితి ఏం బాగాలేదని తనకు షాపు పెట్టుకోవడానికి సహాయం చేయాలని కోరాడు. మంత్రి తనకు కట్టింగ్, షేవింగ్ చేయాలని నైపుణ్యాన్ని పరిశీలించి సాయం చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

రోహిదాస్ వెంటనే ఫేస్ మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుని కటింగ్, షేవింగ్ చేశాడు. అనంతరం ముఖాన్ని అద్దంలో చూసుకున్న మంత్రి బార్బర్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. ఆ తరువాత 60 వేలు ఇచ్చి షాపు పెట్టుకోవాలని మంత్రి సూచించడంతో రోహిదాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల చాలామంది సెలూన్లకు వెళ్లాలంటే భయపడుతున్నారని… అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఉండవని చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

7 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

8 hours ago