దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వల్ల అంచనాలకు మించి కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్, వైరస్ పై సమర్థవంతంగా పని చేసే ఔషధాలు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రొగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల కరోనా మరణాల ముప్పును అడ్డుకోవచ్చని తెలుపుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు కరోనా మరణాల ముప్పును తగ్గించుకోవడానికి సి విటమిన్, డి విటమిన్ అవసరమని చెప్పినా వీటితో పాటు ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
ఎవరికైతే రక్తంలో జింక్ తక్కువగా ఉంటుందో వారికి వైరస్ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని బార్సిలోనాలోని టెర్షరీ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శరీరంలో జింక్ కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నంతో కణాల పెరుగుదల, విభజన కోసం ఉపయోగపడుతుంది. శరీరంలో జింక్ స్థాయిలు పెరగాలంటే జింక్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.
చిక్కుళ్లలో మనకు కావాల్సినంత జింక్ లభిస్తుంది. చిక్కుళ్లు మొలకెత్తినవి లేదా ఉడకబెట్టినవి లేదా నానబెట్టినవి తింటే మంచిది. నువ్వులు, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు కూడా జింక్ ను శరీరంలో పెంచడంలో సహాయపడతాయి. పాలు, గుడ్లు, డార్క్ చాకెట్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత జింక్ పుష్కలంగా లభిస్తుంది.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…