సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ గా నటించారు భాగ్యశ్రీ. తెలుగు ప్రేక్షకులకు ఆమె అంతగా తెలియకపోయినా.. బాలీవుడ్ లో ప్రేక్షకులకు ఆమె పేరు సుపరిచితమే. ఆమెకు ఈ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
ఆమె నటించిన మొదటి సినిమాకే అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో తర్వాత బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది. గత కొంతకాలంగా ఆమెకు ఎన్ని సినిమాలు తీసినా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ఆమె త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్లో ప్రభాస్ తల్లిగా నటించింది. అంతే కాకుండా ఆమె ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లోనూ నటిస్తోంది. ఆమె చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దస్సాని అనే కుమార్తె ఉన్నారు.
అయితే అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో నటించనుందని ఆమె ఇటీవల ప్రకటించారు. బెల్లంకొండ గణేష్ కి జోడీగా ఈమె నటించనున్నట్లు సమాచారం. ఇతడు నాంది సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. దీనిలోనే దస్సాని నటించనున్నట్లు సమాచారం. ఇక అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…