సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ గా నటించారు భాగ్యశ్రీ. తెలుగు ప్రేక్షకులకు ఆమె అంతగా తెలియకపోయినా.. బాలీవుడ్ లో ప్రేక్షకులకు ఆమె పేరు సుపరిచితమే. ఆమెకు ఈ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
ఆమె నటించిన మొదటి సినిమాకే అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో తర్వాత బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది. గత కొంతకాలంగా ఆమెకు ఎన్ని సినిమాలు తీసినా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ఆమె త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్లో ప్రభాస్ తల్లిగా నటించింది. అంతే కాకుండా ఆమె ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లోనూ నటిస్తోంది. ఆమె చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దస్సాని అనే కుమార్తె ఉన్నారు.
అయితే అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో నటించనుందని ఆమె ఇటీవల ప్రకటించారు. బెల్లంకొండ గణేష్ కి జోడీగా ఈమె నటించనున్నట్లు సమాచారం. ఇతడు నాంది సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. దీనిలోనే దస్సాని నటించనున్నట్లు సమాచారం. ఇక అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…