Bheemla Nayak: దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీ విడుదల అవుతున్నట్టు చిత్ర బృందం ప్రకటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్ర బృందం అభిమానులకు చేదు వార్త తెలియజేస్తూ ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషపడ్డారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా జనవరి 7న విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ ఫోన్ చేయించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి సినిమా పై దాడి చేశారు.
అయితే ఈ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడిన విషయం తెలియడంతో పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడటంతో ఆ తర్వాత విడుదల కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వినబడుతున్నాయి.
అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. ఇలా నాగార్జున బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్ వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో దిగటానికి సిద్ధం అయ్యాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదల ఉండదని హింట్ ఇచ్చిన అభిమానులు మాత్రం ఈ సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…