Big Boss OTT : దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న బుల్లితెర ప్రోగ్రాం లలో టాప్ రేటెడ్ ప్రోగ్రాం గా కొనసాగుతోంది బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది. ప్రతిరోజు ప్రసారం అయ్యే ఒక గంట ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. అందుకే మరో అడుగు ముందుకు వేసి బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులు ఏం చేస్తున్నారో 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి మొత్తం 18 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఫినాలేకు అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా చేరుకున్నారు.
అయితే ఈ సారి బిగ్ బాస్ మొత్తం గొడవల తోనే ఎక్కువగా సాగింది. అయితే ఈ బిగ్ బాస్ లో ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి అమ్మాయి విన్నర్ గా నిలిచారు. శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో నాగార్జున, బిందు మాధవిని విన్నర్గా ప్రకటించాడు. ఇక సెకండ్ ప్లేస్ లో అఖిల్ సార్థక్ నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ నిలిచాడు. వీటిని ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్కేస్ తీసుకొని రేసు నుంచి తప్పుకుంది.
బిందు మాధవి ఎన్ని లక్షలు సొంతం చేసుకుంది…..
బిగ్ బాస్ విన్నర్ అయిన బిందు స్టేజీపై భావోద్వేగానికి లోనై ఉక్కిరిబిక్కిరి అయింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇక్కడ అవకాశలు లేక కోలీవుడ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కొందరికి కొన్ని రోజులు కష్టపడితే సక్సెస్ వస్తే, మరికొంతమందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే కానీ విజయం రాదు. అలా ఆలస్యంగా విజయాన్ని సొంతం చేసుకొనే లేట్ బ్లూమర్స్కు నా గెలుపు అంకితం. నేను కూడా ఒక లేట్ బ్లూమర్నే, అని చెప్తూ స్టేజ్ మీదనే ఎమోషనల్ అయ్యింది. అయితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రైజ్ మనీ గా రూ.40 లక్షలను సొంతం చేసుకుంది. మొత్తం 50 లక్షలు రావ్వాల్సి ఉండగా అరియనా 10 లక్షలు తీసుకోవడం తో ప్రైజ్ మనీ తగ్గించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…