ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతూ ఉంటారు. గత సంవత్సరం రైతులకు కాసుల వర్షం కురిపించి.. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉల్లి కిలో 10 రూపాయలకు అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం మార్కెట్ లో 60 నుంచి 80 రూపాయలకు చేరుకోనున్నారు.
మరికొన్ని రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతేడాది కిలో ఉల్లి 160 రూపాయల వరకు పలికింది. ఈ సంవత్సరం వర్షాలు, వరదల వల్ల ఉల్లి కుళ్లిపోవడంతో ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కిలో ఉల్లి 200 రూపాయలు పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పండగల నేపథ్యంలో ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉల్లి ధరలు భారీగా పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశంలోని ప్రధాన మార్కెట్ లలో క్వింటాల్ ఉల్లి ధర 6,000 రూపాయల నుంచి 7,000 మధ్య పలుకుతోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో సైతం ఉల్లి పంట దెబ్బ తినడంతో ధర భారీగా పెరిగింది.
ఉల్లి ధర భారీగా పెరిగితే 2021 ఫిబ్రవరి వరకు ధరలు అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు మూసివేయడంతో గతంలో ఉల్లి ధరలు తగ్గగా డిమాండ్ పెరగడం వల్ల ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…