General News

సామాన్యులకు భారీ షాక్.. ఉల్లి ధర రూ.200కు చేరుకోనుందా..?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతూ ఉంటారు. గత సంవత్సరం రైతులకు కాసుల వర్షం కురిపించి.. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉల్లి కిలో 10 రూపాయలకు అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం మార్కెట్ లో 60 నుంచి 80 రూపాయలకు చేరుకోనున్నారు.

మరికొన్ని రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతేడాది కిలో ఉల్లి 160 రూపాయల వరకు పలికింది. ఈ సంవత్సరం వర్షాలు, వరదల వల్ల ఉల్లి కుళ్లిపోవడంతో ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కిలో ఉల్లి 200 రూపాయలు పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పండగల నేపథ్యంలో ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఉల్లి ధరలు భారీగా పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశంలోని ప్రధాన మార్కెట్ లలో క్వింటాల్ ఉల్లి ధర 6,000 రూపాయల నుంచి 7,000 మధ్య పలుకుతోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో సైతం ఉల్లి పంట దెబ్బ తినడంతో ధర భారీగా పెరిగింది.

ఉల్లి ధర భారీగా పెరిగితే 2021 ఫిబ్రవరి వరకు ధరలు అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు మూసివేయడంతో గతంలో ఉల్లి ధరలు తగ్గగా డిమాండ్ పెరగడం వల్ల ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

16 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

16 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

17 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

17 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

17 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

17 hours ago