బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈవారం నామినేషన్ లిస్ట్ లో ప్రియాంక, శ్రీరామ్, ప్రియా, రవి,లహరి ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తికాగానే హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. ముఖ్యంగా ప్రియా -లహరి-రవి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు.
ఈ ముగ్గురి మధ్య జరిగిన మాటల యుద్ధంలో రవి ఒక్కొక్కరి దగ్గర ఒక విధంగా మాట్లాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నాడని నెటిజన్లు యాంకర్ రవిని ట్రోల్ చేస్తున్నారు. యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తోందని అందుకే తను నాతో ఉంటుంది. పెళ్లికానీ అమ్మాయి కదా.. నేను ఆమెతో చెప్పలేకపోతున్నారని రవి ప్రియ దగ్గర అన్నారంటూ పింకీ లహరికి చెబుతుంది.దీంతో లహరి నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని నేరుగా రవి దగ్గరకు వెళ్లి ఇదే విషయమై నిలదీస్తుంది.
నేను యాంకరింగ్ కోసమే ట్రై చేస్తున్నానని అందుకే నీకు పనులు చేసి పెడుతున్నానని అన్నారట ఇక్కడ పెళ్లికాని వారు చాలామంది ఉన్నారు తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని అన్నావా..అని నిలదీస్తుంది. దాంతో రవి నేను అలా అనడంలేదని అడ్డంగా తలఊపాడు .కానీ ప్రియా మాత్రం… లహరి సింగిల్ గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతో ఉంటుంది. తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని రవి అన్నాడని చెబుతోంది. ఈమాట రవి నేను అనలేదని చెప్పడంతో ప్రియ ఏడుస్తూ.. నువ్వు అన్నావు బ్రో నేను విన్నాననీ చెబుతుంది.
ఇలా లహరి దగ్గర ఒక మాట… ప్రియా దగ్గర ఒక మాట మాట్లాడుతూ రవి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున తనని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలావుండగా మరోవైపు లోబో ప్రియాంక సింగ్ ని చూసి ఏదో సైగ చేశాడు అని.. వెంటనే వచ్చి తనని అలా తాకడంతో ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ వెంటనే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నానని,లోబో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడనీ పింకీ కాజల్ తో చెప్పుకొని బాధపడుతోంది. ఇలా మొత్తానికి హౌ సభ్యుల మధ్య వేడి వాతావరణం తలెత్తడంతో బిగ్ బాస్ అందరినీ కలపడానికి “హైదరాబాద్ అమ్మాయి -అమెరికా అబ్బాయి” అనే టాస్క్ ఇచ్చి అందరిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…