బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈవారం నామినేషన్ లిస్ట్ లో ప్రియాంక, శ్రీరామ్, ప్రియా, రవి,లహరి ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తికాగానే హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. ముఖ్యంగా ప్రియా -లహరి-రవి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు.
ఈ ముగ్గురి మధ్య జరిగిన మాటల యుద్ధంలో రవి ఒక్కొక్కరి దగ్గర ఒక విధంగా మాట్లాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నాడని నెటిజన్లు యాంకర్ రవిని ట్రోల్ చేస్తున్నారు. యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తోందని అందుకే తను నాతో ఉంటుంది. పెళ్లికానీ అమ్మాయి కదా.. నేను ఆమెతో చెప్పలేకపోతున్నారని రవి ప్రియ దగ్గర అన్నారంటూ పింకీ లహరికి చెబుతుంది.దీంతో లహరి నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని నేరుగా రవి దగ్గరకు వెళ్లి ఇదే విషయమై నిలదీస్తుంది.
నేను యాంకరింగ్ కోసమే ట్రై చేస్తున్నానని అందుకే నీకు పనులు చేసి పెడుతున్నానని అన్నారట ఇక్కడ పెళ్లికాని వారు చాలామంది ఉన్నారు తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని అన్నావా..అని నిలదీస్తుంది. దాంతో రవి నేను అలా అనడంలేదని అడ్డంగా తలఊపాడు .కానీ ప్రియా మాత్రం… లహరి సింగిల్ గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతో ఉంటుంది. తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదని రవి అన్నాడని చెబుతోంది. ఈమాట రవి నేను అనలేదని చెప్పడంతో ప్రియ ఏడుస్తూ.. నువ్వు అన్నావు బ్రో నేను విన్నాననీ చెబుతుంది.
ఇలా లహరి దగ్గర ఒక మాట… ప్రియా దగ్గర ఒక మాట మాట్లాడుతూ రవి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున తనని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలావుండగా మరోవైపు లోబో ప్రియాంక సింగ్ ని చూసి ఏదో సైగ చేశాడు అని.. వెంటనే వచ్చి తనని అలా తాకడంతో ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ వెంటనే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నానని,లోబో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడనీ పింకీ కాజల్ తో చెప్పుకొని బాధపడుతోంది. ఇలా మొత్తానికి హౌ సభ్యుల మధ్య వేడి వాతావరణం తలెత్తడంతో బిగ్ బాస్ అందరినీ కలపడానికి “హైదరాబాద్ అమ్మాయి -అమెరికా అబ్బాయి” అనే టాస్క్ ఇచ్చి అందరిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు.
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…