ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కి యూట్యూబ్ స్టార్ట్ గా, యాంకర్స్, ఆర్టిస్టులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్ లను పంపించారు.
ఈ విధంగా హౌస్ లోకి వెళ్ళిన ఈ కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్, నామినేషన్, ఎలిమినేషన్స్ టైటిల్ విన్నర్ వీళ్లే అంటూ పెద్దఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19మంది కంటెస్టెంట్ లో కొంత మంది కంటెస్టెంట్ లు చాలా స్ట్రాంగ్ అని ఈ 8 మంది హౌస్ లో ఎక్కువ రోజులు ఉండడంతోపాటు టైటిల్ గెలుచుకోవడానికి పోటీపడతారనీ నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు వారు అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
యాంకర్ రవి: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అదే రవికి బలం అని చెప్పవచ్చు.
షణ్ముఖ్ జస్వంత్: షణ్ముఖ్ యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని బలం యూట్యూబ్ ఫ్యాన్ ఫాలోయింగ్.
సిరి హన్మంత్: లేడీ కంటెస్టెంట్ లో ఒకరైన సిరి హన్మంత్ కి కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ షో, యూట్యూబ్ ఫాలోయింగ్ ఈమె బలం అని చెప్పవచ్చు.
సింగర్ శ్రీరామచంద్ర: సింగర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీ రామచంద్ర ఇండియన్ టైటిల్ విజేత కావడం అలాగే తన గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఈయనకు బలం అని చెప్పవచ్చు.
సరయు: లేడీ కంటెస్టెంట్ లలో సిరి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ సరయు అని చెప్పవచ్చు. ఈమెకు యూట్యూబ్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అలాగే ఏ విషయమైనా ముక్కుసూటితనంగా మాట్లాడే తత్వం ఈమె బలం.
మానస్ : సీరియల్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్ ఇదే అతని బలం.
ప్రియాంక సింగ్: ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ సింపతీనే ఈమె బలం.
లోబో: ఒకప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోబో ప్రస్తుతం తన కామెడీ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. తన కామెడీనే ఈ కార్యక్రమంలో తనకు మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…