కొన్ని ఘటనలు ఇలా జరుగుతాయిని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇలా ఓ కుటుంబంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంట్లో సరదాగా ఆడకుకుంటూ.. రూపాయి నాణెం మింగింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ చిన్నారికి నాలుగేళ్లు. అల్లారుముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా హున్సూర్ తాలూకాలో అయరహళ్లి గ్రామలో నివాసం ఉంటుంన్నారు. అయితే ఖుషి అనే ఈ నాలుగేళ్ల చిన్నారి.. ఆమె తాతయ్యతో ఇంట్లో ఆడుకుంటుంది. అనుకోకుండా ఒక రూపాయి నాణాన్ని మింగింది.
గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మైసూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేసి గొంతుల్లో ఇరుక్కుపోయిన నాణాన్ని బయటకు తీయడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నాణెం లోనికి వెళ్లడం వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంతో చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలోనే కాదు.. ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో సందడిగా ఆడుకునే తన కూతురును చూసి ఎంతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఈ ఘటన తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వారు తనబిడ్డ లేదనే బాధతో.. వారు చేస్తున్న ఆర్తనాదాలు ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…