ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కి యూట్యూబ్ స్టార్ట్ గా, యాంకర్స్, ఆర్టిస్టులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్ లను పంపించారు.
ఈ విధంగా హౌస్ లోకి వెళ్ళిన ఈ కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్, నామినేషన్, ఎలిమినేషన్స్ టైటిల్ విన్నర్ వీళ్లే అంటూ పెద్దఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19మంది కంటెస్టెంట్ లో కొంత మంది కంటెస్టెంట్ లు చాలా స్ట్రాంగ్ అని ఈ 8 మంది హౌస్ లో ఎక్కువ రోజులు ఉండడంతోపాటు టైటిల్ గెలుచుకోవడానికి పోటీపడతారనీ నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు వారు అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
యాంకర్ రవి: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అదే రవికి బలం అని చెప్పవచ్చు.
షణ్ముఖ్ జస్వంత్: షణ్ముఖ్ యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని బలం యూట్యూబ్ ఫ్యాన్ ఫాలోయింగ్.
సిరి హన్మంత్: లేడీ కంటెస్టెంట్ లో ఒకరైన సిరి హన్మంత్ కి కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ షో, యూట్యూబ్ ఫాలోయింగ్ ఈమె బలం అని చెప్పవచ్చు.
సింగర్ శ్రీరామచంద్ర: సింగర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీ రామచంద్ర ఇండియన్ టైటిల్ విజేత కావడం అలాగే తన గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఈయనకు బలం అని చెప్పవచ్చు.
సరయు: లేడీ కంటెస్టెంట్ లలో సిరి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ సరయు అని చెప్పవచ్చు. ఈమెకు యూట్యూబ్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అలాగే ఏ విషయమైనా ముక్కుసూటితనంగా మాట్లాడే తత్వం ఈమె బలం.
మానస్ : సీరియల్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్ ఇదే అతని బలం.
ప్రియాంక సింగ్: ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ సింపతీనే ఈమె బలం.
లోబో: ఒకప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోబో ప్రస్తుతం తన కామెడీ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. తన కామెడీనే ఈ కార్యక్రమంలో తనకు మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…