ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కి యూట్యూబ్ స్టార్ట్ గా, యాంకర్స్, ఆర్టిస్టులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్ లను పంపించారు.
ఈ విధంగా హౌస్ లోకి వెళ్ళిన ఈ కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్, నామినేషన్, ఎలిమినేషన్స్ టైటిల్ విన్నర్ వీళ్లే అంటూ పెద్దఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19మంది కంటెస్టెంట్ లో కొంత మంది కంటెస్టెంట్ లు చాలా స్ట్రాంగ్ అని ఈ 8 మంది హౌస్ లో ఎక్కువ రోజులు ఉండడంతోపాటు టైటిల్ గెలుచుకోవడానికి పోటీపడతారనీ నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు వారు అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
యాంకర్ రవి: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అదే రవికి బలం అని చెప్పవచ్చు.
షణ్ముఖ్ జస్వంత్: షణ్ముఖ్ యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని బలం యూట్యూబ్ ఫ్యాన్ ఫాలోయింగ్.
సిరి హన్మంత్: లేడీ కంటెస్టెంట్ లో ఒకరైన సిరి హన్మంత్ కి కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ షో, యూట్యూబ్ ఫాలోయింగ్ ఈమె బలం అని చెప్పవచ్చు.
సింగర్ శ్రీరామచంద్ర: సింగర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీ రామచంద్ర ఇండియన్ టైటిల్ విజేత కావడం అలాగే తన గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఈయనకు బలం అని చెప్పవచ్చు.
సరయు: లేడీ కంటెస్టెంట్ లలో సిరి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ సరయు అని చెప్పవచ్చు. ఈమెకు యూట్యూబ్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అలాగే ఏ విషయమైనా ముక్కుసూటితనంగా మాట్లాడే తత్వం ఈమె బలం.
మానస్ : సీరియల్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్ ఇదే అతని బలం.
ప్రియాంక సింగ్: ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ సింపతీనే ఈమె బలం.
లోబో: ఒకప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోబో ప్రస్తుతం తన కామెడీ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. తన కామెడీనే ఈ కార్యక్రమంలో తనకు మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పవచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…