బిగ్ బాస్ రియాల్టీ షోలో రెండు వారాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లకు 17 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ సారి వైల్డ్ కార్టు ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు కానీ ఇంతవరకు హౌస్ లోకి ఎవరూ వెళ్లలేదు. అయితే హౌస్ లో కామెడీ తగ్గిందనే చెప్పాలి. గత సీజన్ కంటే ఈ సీజన్ కాస్తంత బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉండగా ప్రతీ సోమవారం ఆ వారానికి సంబంధించి ఎలిమినేష్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడో వారం ఎలిమినేషన్ కు ఎవరు నామినేట్ లో ఉన్నారో తెలిసిపోయింది. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవారం నామినేషన్ లిస్టు లో ప్రియా, ప్రియాంక సింగ్, లహరి, శ్రీరామచంద్ర, మానస్ లు నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం ఐదుగురు మూడో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్లకు వచ్చే ఓట్లను బట్టి.. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. దీనిలో మొదటిసారి నామినేషన్లోకి వచ్చింది శ్రీరామ చంద్ర మరియు లహరి. ఇదిలా ఉండగా..హౌస్ లో సిస్టమ్ సరిగ్గా లేదని ప్రతీ ఒక్కరినీ సెట్ చేస్తానని చెప్పి.. నాగార్జున రెండు రోజులు వారితో ముచ్చటించిన విషయం తెలిసిందే. ప్రియా, ప్రియాంకా సింగ్, మానస్ లు రెండో వారంలో కూడా నామినేట్ అయి సేవ్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ వారం వారు హౌస్ లో కొనసాగుతారా లేదా బయటికి వస్తారో వేచిచూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…