Shanmukh-Siri Hanmanthu: రెండు జంటలు విడిపోవడానికి కారణం అయిన బిగ్ బాస్..ఆ పాపం ఊరికే పోదు అంటూ..!
తెలుగులో బిగ్ బాస్ సీజన్ మొదలైన దగ్గర నుంచి.. అంటే మొదటి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు ఏ జంట కూడా ఎక్కువగా ట్రోల్స్ గురి కాలేదు. సీజన్ 5లో మాత్రమే అలా జరిగింది. షణ్ముఖ్, సిరిల మధ్య వ్యవహారం ఇప్పుడు బయట ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎవరినీ అడిగినా.. వాళ్లు హౌస్ లో పెద్ద ఛండాలమే చేశారు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు.
నిజానికి షణ్ముఖ్ టైటిల్ గెలవాల్సింది.. కానీ కేవలం సిరి హగ్గులు.. కిస్సుల కారణంగానే ఓ జోనర్ లో ఉంటే ప్రేక్షకులు సహించలేకపోయారు. వాళ్ల వ్యవహారాన్ని ఫ్యామిలీ సభ్యులతో చూడలేకపోయారు. దీంతో షణ్ముఖ్ కు ఓట్లు తగ్గాయి. దీంతో అదే అవకాశంగా సన్నీ కప్ ను ఎగురేసుకుపోయాడు. ఇక దీని గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. దీని అంతటికి కారణం బిగ్ బాసే అంటూ నెటిజన్లు కూడా ఆరోపిస్తున్నారు.
ఎందుకంటే.. టాప్ 5లో ఉన్న వాళ్లు ఇంటికి వెళ్లే సమయంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. కానీ.. సిరికు వెల్ కమ్ చెప్పడానికి ఆమె లవర్.. జోడీ.. శ్రీహాన్ ఎక్కడా కనిపించలేదు.. కారణం ఏంటి..? సేమ్ అదేవిధంగా.. షణ్ముఖ్ కూడా అంతే. అతడి లవర్.. జోడీ.. దీప్తి సునయానా కూడా ఎక్కడా కనిపించలేదు. కారణం ఏంటి.. ? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. ఇక దీప్తి తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఇలా రాసుకొచ్చింది.. ‘కనీసం నీకు నవ్వైనా ఆన్సర్ ఇచ్చుకో’.. నీకు నువ్వు ఆలోచించు అన్నట్లుగా ఆమె పోస్టు చేసింది. దీంతో.. ఒక్కసారిగా ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఒక్క బిగ్ బాస్ కారణంగానే ఎంతో అన్యోన్యంగా ఉన్న రెండు జంటలు విడిపోయాయని.. బిగ్బాస్ ను ఆడేసుకుటున్నారు నెటిజన్లు.. అరేయ్ బిగ్ బాస్ గా.. ఎంత పని చేశావ్ రా.. అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.. బయట ట్రోలింగ్స్ పై శ్రీహాన్, దీప్తి ఎలా ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కానీ షణ్ముఖ్, సిరి హౌస్ లోపల.. ఎమోషనల్ పేరుతో.. స్నేహం అనే ముసుగులో ఇలా ఉండటం మాత్రం తప్పు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…