బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలిచినటువంటి వారికి ప్రైస్ మనీ 50 లక్షల రూపాయలను అందిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం 50 లక్షల ప్రైస్ మనీతో పాటు 25 లక్షల విలువచేసే సువర్ణభూమి 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.
ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో 50 లక్షల రూపాయకు గెలిస్తే ఎవరు ఏం చేస్తారని నాగార్జున అడిగారు. ఇలా నాగార్జున అడగడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి అమ్మలకి ఇస్తామని ,మరికొందరు అప్పులు కడతామని, కొందరు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తామని తెలిపారు.
కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్ ప్రియాంక మాత్రం తను అమ్మను అవుతానని షాకింగ్ కామెంట్ చేశారు.తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉందని అయితే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని సూచించారని ప్రియాంక తెలిపారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో లో 50 లక్షలు గెలిస్తే తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టించి అనంతరం తను ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకు అమ్మ అవుతానని ప్రియాంక తెలిపారు. ఇలా బిగ్ బాస్ ద్వారా తన కోరికను నెరవేర్చుకుంటానని ప్రియాంక తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…