గత నాలుగు సీజన్లలో పోలిస్తే ఈ సీజన్ లోని కంటెస్టెంట్ ల మధ్య తారాస్థాయిలో గొడవలు చోటు చేసుకుంటూ టాస్క్ లో బల ప్రయోగాలు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ఈవారం కెప్టెన్సీ లో భాగంగా కుటుంబ సభ్యులను రెండు జట్లుగా విడదీసిన బిగ్ బాస్ ఈ రెండు జట్లకు టాస్క్ ఇవ్వగా ఎవరికి వారు వారి బలాన్ని నిరూపించుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
హౌస్ సభ్యులను ఎల్లో టీం, బ్లూ టీమ్ గా విడదీసిన బిగ్ బాస్ ఈ రెండు జట్ల మధ్య కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్ధం జరిగి తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎల్లో టీంలో ఉన్నటువంటి శ్వేత చాలా వైల్డ్ గా ఆడుతోందని, బ్లూ టీమ్ సభ్యులు ఆరోపించారు. అవును సాయంత్రమయ్యే సరికి శ్వేతకు దయ్యం పడుతుందని ప్రియ ఆరోపించారు.
ఇదిలా ఉండగా సన్నీని ఉద్దేశించి ప్రియా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నువ్వు మగాడివైతే వచ్చి ఆడు అనడంతో సన్నీ అందుకు రియాక్ట్ అవుతూ.. మగాడివైతే అనే మాటలు ఉపయోగించవద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఈవారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఈ రెండు జట్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
ఇకపోతే ఈ వారం నామినేషన్ లిస్టులో ఏడుగురు సభ్యులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని భావిస్తున్నప్పటికీ వైల్డ్ కార్డు ద్వారా మరో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఈ విషయం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…