బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్ ప్రక్రియలో ఎక్కువగా హైలెట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి. ఈమె బుల్లితెరలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంత మంచి ఫాలోయింగ్ ఉన్న ఆ సీరియల్ లో నటించిన వ్యక్తికి ఓట్లు రాకపోవడానికి గల కారణం ఏంటంటే.. ఎలిమినేషన్ లో ఆమె నోటి నుంచి వచ్చిన అసభ్యకర పదాలు. దానికి బిగ్ బాస్ కూడా ఆ పదం వచ్చినప్పుడు బీప్ వేశాడు.
అంతలా ఆమెకు ఆ సమయంలో దురదృష్టం పట్టిందనే చెప్పాలి. తర్వాత ఆమె రియలైజ్ అయి లోబోతో రొమాన్స్ ట్రాక్ నిడిపించింది. అందరితో మంచిగా మెలుగుతూ ఉన్నా.. ఆమెకు లాభం లేకుండా పోయింది. ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే ఆమె మరికొన్ని రోజులు ఆ హౌస్ లో ఉండేది.
ఫ్యామిలీ ప్రేక్షకులు ఆమెకు ఓటు వేయకపోవడానికి గల కారణం అదే అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి బాధ గానీ.. ఎలాంటి నిరుత్సాహం గానీ కనిపించలేదు. హౌస్ లో ఉన్నవాళ్లను కూడా ఎలాంటి మాట అనకుండా.. ఒకొక్కరి గురించి కుండబద్దలు కొట్టి చెప్పింది.
అందరితో వెళ్లే ముందు ప్రశంసలు పొందింది కానీ.. అప్పటికే ఆమెకు ఆలస్యం అయిపోయింది. హౌస్ లోకి వెళ్లేముందు గయ్యాళిగా పేరుపొందిన ఉమాదేవి.. హౌల్ లోకి వెళ్లాక నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి వెళ్లింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆమె అదే పేరుతో బయటకు రావడం వేశేషం.
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న…
తెలంగాణ గ్రామాలకు కేంద్రం నుంచి మరోసారి ఆర్థిక ఊతం లభించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 15వ ఆర్థిక సంఘం మూడో…
ప్రేమ, పెళ్లి, సంబంధాలు—కాలం మారేకొద్దీ ఇవన్నీ కొత్త రూపం దాలుస్తున్నాయి. ఒకప్పుడు “పర్ఫెక్ట్ వ్యక్తి దొరకాలి” అనే ఆశ ఎక్కువగా…