Bigg Boss6: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ బయటకు వచ్చింది.
ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే… దీపికా పిల్లి, శ్రీహాన్, ఆర్ జ సూర్య, చలాకీ చంటి, గీతూ రాయల్, యాంకర్ ఉదయభాను, అమర్ దీప్, ఆదిరెడ్డి వంటి తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.అలాగే నాన్ స్టాప్ సీజన్లో పాల్గొన్న కొందరు కంటెంట్ లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇక గత సీజన్ ఫైవ్ సిరి పాల్గొనగా సీజన్ సిక్స్ లో తన ప్రియుడు శ్రీహాన్ పాల్గొనబోతున్నారు.అలాగే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్ తాజాగా నటి తేజస్వినితో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తన పెళ్లిని వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా లేక త్వరగా పెళ్లి పూర్తి చేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…