General News

చికెన్ తినేవాళ్లకు శుభవార్త.. కిలో చికెన్ 15 రూపాయలు మాత్రమే..?

మనలో చాలామంది మాంసాహారం ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. చికెన్, మటన్ లేనిదే తిండి తినని వాళ్లు చాలామంది ఉంటారు. అయితే చికెన్ ధరలు గత కొన్ని రోజుల నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వల్ల వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కోళ్లు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశాలు ఉంటుంది. బర్డ్ ఫ్లూ బారిన పడిన కోళ్లను తింటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో సైతం బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు మృత్యువాత పడటంతో గుడ్డు, చికెన్ ధరలు తగ్గుతున్నాయి. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో చాలామంది ప్రజలు భయాందోళనకు గురై చికెన్, గుడ్లు తినడానికి ఆసక్తి చూపలేదు. ఆ తరువాత శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, రాజకీయ, సినీ ప్రముఖులు చికెన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయే తప్ప ఎటువంటి సమస్యలు రావని స్పష్టతనివ్వడంతో ప్రజలు చికెన్, గుడ్లు తినడానికి ఆసక్తి చూపారు.

అయితే బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో కిలో చికెన్ 15 రూపాయలకు పడిపోవడం గమనార్హం. ధరలు భారీగా తగ్గడంతో కోళ్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుస్తోంది. చికెన్ ను కొనుగోలు చేసినా బాగా ఉడికించి తింటే బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.

అయితే చికెన్ ప్రియులు మాత్రం తక్కువ ధరకే చికెన్ కొనుగోలు చేసే అవకశం ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ దుకాణాదారులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తమకు గిట్టుబాటు కాకపోయినా చికెన్ ను విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. దేశంలో బర్డ్ ఫ్లూ అదుపులోకి వస్తే మాత్రమే గుడ్లు, చికెన్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి నిద్ర పట్టట్లేదా? గర్భిణులకు ఉపయోగకరమైన టిప్స్

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…

20 minutes ago

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…

50 minutes ago

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

1 hour ago

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

2 hours ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

3 hours ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

11 hours ago