Featured

BJP : కర్ణాటకలో బొక్క బోర్లాపడ్డ బీజేపీ.. షేక్ అవుతున్న జగన్ ప్రభుత్వం..!

BJP : కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం మాటేమో కానీ.. దానిని చూసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో వణుకు పుడుతోంది. ప్రజల్లో బీజేపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. ఇతర రాష్ట్రాల మాటేమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతసేపు తెలంగాణను చూస్తున్నామే కానీ ఏపీలో పరిస్థితులు కూడా దారుణంగా తయారయ్యాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులే ఇంచుమించుగా ఏపీలో కూడా నెలకొనడం ఒక కారణమైతే.. బీజేపీతో దోస్తి మరో కారణం.

40 శాతం కమీషన్‌ సర్కార్‌..

గత ఎన్నికల అనంతరం కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఎంతో కాలం సాగనివ్వకుండా ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇది అక్కడి ప్రజల్లో అసహనాన్ని రేపింది. ఆ తరువాత బొమ్మై సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ప్రతి పనికి కూడా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లు తీసుకునేవారు. దీంతో సర్కార్‌పై అవినీతి ఆరోపణలకు అంతే లేకుండా పోయింది. ‘40 శాతం కమీషన్‌ సర్కార్‌’అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది కూడా ఒక కారణం. ఏపీలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. అవినీతి, అక్రమాలు పేరుకు పోయాయన్న టాక్ ఉంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. దీనిపై ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇక ప్రతి ఒక్క పనికి ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

కేంద్రం మెడలు వంచుతాం..

స్వలాభం కోసం కేంద్రంతో దోస్తీ చేసి జనాల్లో ఏపీ ప్రభుత్వం చాలా పలుచన అయిపోయింది. నిజానికి రాజధాని కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి మట్టి, నీళ్లు గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తే చేసింది కానీ ఏ విషయంలోనూ.. ఏపీకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా సీఎం జగన్ నోరు మెదిపింది లేదు. కేంద్రం మెడలు వంచుతామని ఆర్భాటంగా ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ఆయనే సరెండర్ అయిపోయారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నా కూడా పెదవి విప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకున్నా.. సైలెన్స్ మెయిన్‌టైన్ చేసింది. ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీపై వచ్చిన వ్యతిరేకతను చూసిన తర్వాత వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టాక్.

ఏపీ జనమెరిగిన సత్యం..

కర్ణాటక ఫలితాలు అన్ని రాష్ట్రాలకూ ఒకింత అలెర్ట్ సిగ్నల్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇక ముందు బీజేపీతో వైసీపీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఏం చేసినా తానా అంటే తందానా అంటుందా? లేదంటే సైలెంట్‌గా తన పని తాను చూసుకుంటుందా? అంటే ఇక ముందు కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం ఎదురు తిరిగేంత సీన్ అయితే ప్రస్తుత తరుణంలో వైసీపీకి లేదు. ఇది ఏపీ జనమెరిగిన సత్యమే. ఈ సమయంలో ఏమైనా కేంద్రానికి ఎదురు తిరిగితే కేసులు ఉండనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మోదీ అండతోనే వాటి నుంచి జగన్ బయట పడుతూ వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలే ఎన్నికల తరుణం. ఈ సమయంలో ఏదైనా జరిగితే అసలుకే ఎసరొస్తుంది. కాబట్టి గప్ చుప్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

5 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

5 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

6 hours ago