Connect with us

Featured

BJP : కర్ణాటకలో బొక్క బోర్లాపడ్డ బీజేపీ.. షేక్ అవుతున్న జగన్ ప్రభుత్వం..!

Published

on

BJP : కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం మాటేమో కానీ.. దానిని చూసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో వణుకు పుడుతోంది. ప్రజల్లో బీజేపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. ఇతర రాష్ట్రాల మాటేమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతసేపు తెలంగాణను చూస్తున్నామే కానీ ఏపీలో పరిస్థితులు కూడా దారుణంగా తయారయ్యాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులే ఇంచుమించుగా ఏపీలో కూడా నెలకొనడం ఒక కారణమైతే.. బీజేపీతో దోస్తి మరో కారణం.

40 శాతం కమీషన్‌ సర్కార్‌..

గత ఎన్నికల అనంతరం కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఎంతో కాలం సాగనివ్వకుండా ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇది అక్కడి ప్రజల్లో అసహనాన్ని రేపింది. ఆ తరువాత బొమ్మై సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ప్రతి పనికి కూడా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లు తీసుకునేవారు. దీంతో సర్కార్‌పై అవినీతి ఆరోపణలకు అంతే లేకుండా పోయింది. ‘40 శాతం కమీషన్‌ సర్కార్‌’అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది కూడా ఒక కారణం. ఏపీలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. అవినీతి, అక్రమాలు పేరుకు పోయాయన్న టాక్ ఉంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. దీనిపై ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇక ప్రతి ఒక్క పనికి ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

Advertisement

కేంద్రం మెడలు వంచుతాం..

స్వలాభం కోసం కేంద్రంతో దోస్తీ చేసి జనాల్లో ఏపీ ప్రభుత్వం చాలా పలుచన అయిపోయింది. నిజానికి రాజధాని కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి మట్టి, నీళ్లు గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తే చేసింది కానీ ఏ విషయంలోనూ.. ఏపీకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా సీఎం జగన్ నోరు మెదిపింది లేదు. కేంద్రం మెడలు వంచుతామని ఆర్భాటంగా ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ఆయనే సరెండర్ అయిపోయారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నా కూడా పెదవి విప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకున్నా.. సైలెన్స్ మెయిన్‌టైన్ చేసింది. ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీపై వచ్చిన వ్యతిరేకతను చూసిన తర్వాత వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టాక్.

ఏపీ జనమెరిగిన సత్యం..

కర్ణాటక ఫలితాలు అన్ని రాష్ట్రాలకూ ఒకింత అలెర్ట్ సిగ్నల్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇక ముందు బీజేపీతో వైసీపీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఏం చేసినా తానా అంటే తందానా అంటుందా? లేదంటే సైలెంట్‌గా తన పని తాను చూసుకుంటుందా? అంటే ఇక ముందు కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం ఎదురు తిరిగేంత సీన్ అయితే ప్రస్తుత తరుణంలో వైసీపీకి లేదు. ఇది ఏపీ జనమెరిగిన సత్యమే. ఈ సమయంలో ఏమైనా కేంద్రానికి ఎదురు తిరిగితే కేసులు ఉండనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మోదీ అండతోనే వాటి నుంచి జగన్ బయట పడుతూ వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలే ఎన్నికల తరుణం. ఈ సమయంలో ఏదైనా జరిగితే అసలుకే ఎసరొస్తుంది. కాబట్టి గప్ చుప్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!