బోయపాటి తదుపరి చిత్రం.. ఇద్దరు హీరోలకు కథను సిద్ధం చేసిన దర్శకుడు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిచిన ‘అఖండ’ చిత్రంతో బోయపాటి శ్రీను తన ఇమేజ్ ను తిరిగి పొందాడు. వినయ విధేయ రామతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న బోయపాటి.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తనతో సినిమా తీయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదని.. అఖండ సినిమాకు కూడా.. తాను పారితోషికం తీసుకోలేదని తెలిసింది.

అతడు అఖండ సినిమాకు పారితోషికం తీసుకోలేదని.. లాభాల్లో షేర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. దీంతో బోయపాటి మళ్లీ గాడిలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు.. అఖండ తర్వాత స్టార్ ఫిల్మ్ మేకర్ దర్శకుడు బోయపాటి తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది.

అఖండ విడుదలకు ముందే.. బోయపాటి అల్లు అర్జున్ , రామ్ పోతినేనితో రెండు వ్యక్తిగత ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరిపినట్లు టాక్. అఖండ తర్వాత మళ్లీ పుంజుకున్న బోయపాటి.. రామ్‌తో తన సినిమా కోసం బోయపాటి 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ఆసక్తి చూపిన చిట్టూరి శ్రీనివాస బోయపాటి అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో వెనక్కి తగ్గాడు.

రామ్‌పై అంత బడ్జెట్ పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. కాబట్టి, బోయపాటి తన తదుపరి చిత్రానికి అల్లు అర్జున్‌తో కలిసి పని చేసే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకురావడానికి ఆసక్తిని కలిగి ఉంది. దీనిని త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. పుష్ప ది రైజ్ తర్వాత అల్లు అర్జున్ తో తదుపరి ప్రాజెక్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించవచ్చు.