మళయాళ ముద్దు గుమ్మ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రైక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, వ్యక్తిత్వంతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. మనకు తెలిసి ఉన్న కొద్దిమంది మంచి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. మంచి పాత్ర పడాలే కానీ.. తనకు తిరుగు ఉండదు.
ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో సరైన హిట్ పడలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ కు జోడిగా భీమ్లానాయక్ లో నటిస్తోంది.. మరోవైపు సత్యదేశ్ హీరోగా నటించిన స్కైలాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కలు కొట్టేసింది. అలాంటి నిత్యామీనన్ గతంలో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి బాధపడింది.
ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ గురించి ఏమనుకుంటున్నారని ఓ రిపోర్టర్ అడగగా.. నాకు ప్రభాస్ తెలియదంటూ సమాధానం ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్దగా రచ్చ నడిచింది. నిత్యామీనన్ పొగరుతో మాట్లాడుతుందని చాలా మంది విమర్శించారు. అయితే అప్పటి పరిస్థితులను గురించి నిత్యామీనన్ వివరించింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తెలుగు రాదు… కనీసం తెలుగు సినిమాలు కూడా చూడలేదని.. వెంటనే ప్రభాస్ గురించి అడిగితే తెలియదని సమాధానం ఇచ్చానిని చెప్పుకొచ్చింది.
దీనిని పెద్దగా చేసి రిపోర్టర్లు రాయడం.. తన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడంపై స్పందించింది. కొన్నిచోట్ల ఎక్కడ నిజాయితీగా ఉండాలో.. ఉండకూడదో అర్థమైందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధపెడుతుందని ఈ మళయాళీ ముద్దు గుమ్మ అంటోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…