మళయాళ ముద్దు గుమ్మ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రైక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, వ్యక్తిత్వంతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. మనకు తెలిసి ఉన్న కొద్దిమంది మంచి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. మంచి పాత్ర పడాలే కానీ.. తనకు తిరుగు ఉండదు.
ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో సరైన హిట్ పడలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ కు జోడిగా భీమ్లానాయక్ లో నటిస్తోంది.. మరోవైపు సత్యదేశ్ హీరోగా నటించిన స్కైలాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కలు కొట్టేసింది. అలాంటి నిత్యామీనన్ గతంలో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి బాధపడింది.
ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ గురించి ఏమనుకుంటున్నారని ఓ రిపోర్టర్ అడగగా.. నాకు ప్రభాస్ తెలియదంటూ సమాధానం ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్దగా రచ్చ నడిచింది. నిత్యామీనన్ పొగరుతో మాట్లాడుతుందని చాలా మంది విమర్శించారు. అయితే అప్పటి పరిస్థితులను గురించి నిత్యామీనన్ వివరించింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తెలుగు రాదు… కనీసం తెలుగు సినిమాలు కూడా చూడలేదని.. వెంటనే ప్రభాస్ గురించి అడిగితే తెలియదని సమాధానం ఇచ్చానిని చెప్పుకొచ్చింది.
దీనిని పెద్దగా చేసి రిపోర్టర్లు రాయడం.. తన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడంపై స్పందించింది. కొన్నిచోట్ల ఎక్కడ నిజాయితీగా ఉండాలో.. ఉండకూడదో అర్థమైందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధపెడుతుందని ఈ మళయాళీ ముద్దు గుమ్మ అంటోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…