Brahmanandam: టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇక బ్రహ్మానందం గారికి ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.
వీరి పెద్ద కుమారుడు గౌతమ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు చిన్న కుమారుడు సిద్ధార్థ్. ఈయన ఉద్యోగ నిమిత్తం విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తాజాగా తన చిన్న కుమారుడికి బ్రహ్మానందం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపిన సంగతి మనకు తెలిసిందే.
బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ కు ఐశ్వర్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఐశ్వర్య కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్ గారి కుమార్తె. కరీంనగర్ లో పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఇలా పద్మజ వినయ్ గారి ఏకైక కుమార్తె ఐశ్వర్య కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ కావడం విశేషం.ఇలా డాక్టర్ అయినటువంటి అమ్మాయిని బ్రహ్మానందం తన కోడలుగా చేసుకుంటున్నారు. ఇక ఈమె పేరిట తమ తల్లిదండ్రులు భారీగానే ఆస్తులను పోగు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా బ్రహ్మానందం బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తన కోడలుగా తీసుకొచ్చారని తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…