YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?

YS Jagan: ఏపీ ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ కేసులను నమోదు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

జగన్‌తో పాటు అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైయస్ జగన్ ఆదేశాల మేరకే నన్ను అరెస్టు చేశారని అదే విధంగా కస్టడీలో ఉన్నటువంటి తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.

అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏ3గా ఉన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను పోలీసులు చేర్చారు.

కొట్టివేసిన కేసుపై ఎఫ్ ఐ ఆర్..
ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారడంతో ఏవన్ గా ఉన్నటువంటి సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు గురించి కోర్టు మూడు సంవత్సరాల క్రితమే ఈ పిటీషన్ ని కొట్టి వేసింది తిరిగి ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఏంటో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ సునీల్ కుమార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago