Breaking News: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఈ విషయం తెలిసినటువంటి క్రికెట్ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
ఉత్తరాఖండ్లోని మంగళూరు సమీపంలో డిసెంబర్ 30వ తేది శుక్రవారం రోజు ఉదయం 5.15 గంటల ప్రాంతంలో క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యారు. ఈయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రేయిలింగ్ ను ఢీకొనింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రిషబ్ తలకు మొహం పై వీపు భాగంలో పెద్ద ఎత్తున గాయాలైనట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు . అయితే ఈయన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన క్షేమంగా కోలుకోవాలని ఎంతో మంది క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…