కరోనా కారణంగా కొన్ని పరిశ్రమలు మూత పడగా.. మరి కొన్ని పరిశ్రమలు లాభాల భాటలో పయనిస్తున్నాయి. అందులో ఫుడ్ ఆధారిత పరిశ్రమలు అయితే లాక్డౌన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవడం, సిబ్బంది లేకపోవడం వల్ల ఎక్కడి ఉత్పత్తి అక్కడే ఆగిపోయాయి. దీంతో ఫుడ్ పరిశ్రమలకు భారీగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం పలు ఫుడ్ పరిశ్రమలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజాగా బ్రిటానియా కూడా క్రమంగా తన ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించింది. గతేడాది అంటే జూన్ 30, 2020తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలై రూ.542.68 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.248.64 కోట్లు మాత్రమే.
మొత్తం ఆదాయం సైతం 26.97 శాతం వృద్ధితో రూ.2,767.8 కోట్ల నుంచి రూ.3,514.35 కోట్లకు చేరుకుంది. ప్రస్తతం కరోనా కారణంగా జూన్ త్రైమాసికం గడ్డుకాలంగా మారింది. లాక్డౌన్ వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయి. దేశవ్యాప్తంగా ప్లాంట్లు, డిపోలు, రవాణా, వెండార్లకు సంబంధించిన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది.
ఇపుడు తిరిగి కరోనా పూర్వపు స్థాయికి పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నామని సంస్థ ఎంపీ వరుణ్ బెర్రీ తెలిపారు. అందుకే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2 శాతం ఈ కామర్స్ వ్యాపారాన్ని 5 శాతానికి పెంచుకోవాలని బ్రిటానియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…
అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…
పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…
తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…
యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…
టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…