కరోనా వ్యాప్తి ప్రస్తుతం దాదాపు తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులను ఆ దేశ ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. కానీ కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారే ఇలా ప్రయాణాలు చేయాలంటూ నిబంధనలు విధించాయి. అయితే ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ వేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ వారికి వచ్చిన చిక్కు ఏంటంటే.. తమ వెంట పిల్లలను తీసుకెళ్లొచ్చా.. లేదా అనేది. ఎందుకంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో పిల్లలను తమ వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందా.. లేదా అనే సందిగ్దంలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు నిబంధనలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా హాంకాంగ్కు ఎంతో మంది వెళుతుంటారు. ఉద్యోగాలతో పాటు పర్యాటకంగానూ ఆ దేశానికి చాలా ప్రయాణిస్తుంటారు.
ఈ క్రమంలోనే పిల్లల కోసం ఆ దేశం ప్రత్యేక నిబంధలను అమలులోకి తెచ్చింది. వ్యాక్సినేషన్ పూర్తికాని పిల్లలు తమ దేశంలోకి రావాలంటే 72 గంటలకు మించకుండా నెగెటివ్ వచ్చిన టెస్టు రిపోర్టును సమర్పించడంతో పాటు ప్రభుత్వ పరిధిలో 21 రోజులు క్వారంటైన్లో ఉండాలనే రూల్ పెట్టింది. ఆ సమయంలోనూ మరికొన్ని కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళితే పిల్లలకు పెద్దలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చైనా విషయానికి వస్తే 16 ఏళ్ల లోపు వారు కచ్చితంగా 16 రోజులు క్వారంటైన్ లో ఉండాలంటూ నిబంధన విధించారు.
ఆమెరికా, ఆస్ట్రేలియా దేశాలల్లో పిల్లలు వెళ్లాలంటే నిబంధనల్లో కాస్త ఊరటను కల్పించారు. అమెరికాకు వెళ్లే వారిలో మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తే సరిపోతుంది. అక్కడకు చేరిన తర్వాత 5 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఆస్ట్రేలియాలో అయితే 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు నెగెటివ్ రిపోర్టు అవసరం లేదు. మిగతా వారు నెగెటివ్ రిపోర్టు చూపిస్తే సరిపోతుంది. ఏదేమైనా విధులకు హాజరయ్యేందుకు విదేశాలకే వెళ్లే వారు ఇలాంటి నిబంధనలతో కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…