కొత్త కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే ఆన్లైన్ ఆటోమొబైల్ క్లాసిఫైడ్స్ సంస్థ కార్ ట్రేడ్ టెక్ ఆగస్టు 9న IPOకి రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్లు రాబట్టాలని భావిస్తోంది. దీనికి అమెరికా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయిన వార్బర్గ్ పింకస్ పెట్టుబడులు భారీగానే ఉన్నాయి.
అంతే కాకుండా ఇందులో సింగపూర్ ప్రభుత్వ రంగ కంపెనీ టెమాసెక్, జేపీ మోర్గాన్, మార్చ్ క్యాపిటల్ పార్ట్నర్స్ కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీ ఆదాయం గత రెండు సంవత్సరాల నుంచి బాగున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 318.44 కోట్లు ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో దీని ఆదాయం రూ.281.52 కోట్లు ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం కంటే గతేడాది దీని ఆదాయం రూ. 31 కోట్లకు పైగా లాభం పొందింది. దీనిలో ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు రూ. 1.85 కోట్ల షేర్లను అమ్మబోతున్నారు. పూర్తిగా ఇది సేల్ ఆధారితంగా ఉంది. దీనికి సంబంధించి ఐపీఓ ఇన్వెస్ట్ మెంట్ అనేది.. బ్యాంకర్ల కింద ఉండబోతున్నాయి. దీనిని 2009 లో ప్రారంభించారు. దీని స్థాపకుడు మరియు సీఈఓ వినయ్ సంఘీ.
ఆయన 2000 నుంచి 2009 వరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్కి సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లు తమ పాత కార్లను అమ్ముకోవచ్చు. కొత్త కార్లను కొనుక్కోవచ్చు.ఇది అన్ని రకాల వాహనాలనూ కవర్ చేస్తుంది. వాల్యూ యాడెడ్ సర్వీసులు అందిస్తుంది. దీనిలో ముఖ్యంగా అక్రియోట్ ఆటో, అటోబిజ్, కార్ వాలే, కార్ ట్రేడ్, శ్రీరామ్ ఆటోమాల్, బైక్ వాలే, కార్ ట్రేడ్ ఎక్స్ఛేంజ్ ఉన్నాయి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…