ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలలో, విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న తారలలో అష్నూర్ కౌర్ ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల బేబ్స్ లాంటి సీరియల్స్, పలు చిత్రాలలో నటిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చదువును ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా చదువులోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.
తాజాగా నటి అష్నూర్ కౌర్ సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ పరీక్ష ఫలితాలు వెలువడటంతో ఈ ఫలితాలలో అద్భుతమైన రికార్డులను నెలకొల్పారు. ఈ పరీక్ష ఫలితాలలో నటి
అష్నూర్కు 94 శాతం మార్పులను సాధించింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియాతో మాట్లాడిన అష్నూర్.. ఈ పరీక్ష ఫలితాలలో ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. అయితే చాలా కష్టపడి పరీక్షలు రాశాను. పదవతరగతిలో 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కష్టపడ్డానని.. కష్టపడినందుకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పరీక్ష ఫలితాల అనంతరం మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేయాలనుకొంటున్నాను. ఇందుకోసం విదేశాలకు వెళ్లి తన చదువును కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కెరీర్ పరంగా తనకు పలు సినిమాలలో నటించడమే కాకుండా దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న
అష్నూర్.. సంజూ మన్మర్జియాన్ చిత్రంలో నటించారు. త్వరలోనే మరికొన్ని చిత్రాల ద్వారా సందడి చేయనున్నారు. అదే విధంగా ఎన్నో రోజుల నుంచి తన కలలుకంటున్న ఇంటి కల త్వరలోనే నెరవేరుతుందని, ప్రస్తుతం తన కలలుగన్న ఇల్లు నిర్మాణ దశలో ఉందని వచ్చే ఏడాది లోనే గృహప్రవేశం చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…