Celebrities About Sharath Babu : విలక్షణ నటుడు విలన్ గాను,హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదల వలస లో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకొక చిలుక,చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981,88,89 మూడు సార్లు ఉత్తమ సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గారు పోరాడి ఓడిపోయారు. ఆయన గురించి సీనియర్ నటుడు మురళి మోహన్ ఆయన అనుబంధాన్ని పంచుకున్నారు.
ఆయన అంత్యక్రియలు అక్కడే….
మురళి మోహన్ గారు శరత్ బాబు గారి పార్థివ దేహానికి నివాళులు అందించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ తెలుగు ఆర్టిస్టులందరు చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా శరత్ బాబు గారు చెన్నై లో సెటిల్ అయ్యారు. ఆయన దాదాపుగా ఐదు భాషల్లోను నటిస్తూ బిజీగా ఉండేవారు. అయితే తెలుగులో కూడా ఆయనకు మంచి పేరుంది అభిమానులున్నారు.
అందుకే ఆయనను చూడటానికి వచ్చేవారి కోసం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన పార్థివ దేహం ఉంచాలని వారి కుటుంబ సభ్యులను అడిగి కొద్ది గంటలు ఇక్కడే ఉంచేలాగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక చెన్నై లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి అంటూ చెప్పారు. ఆయన అయ్యప్పదీక్ష తీసుకుంటూ ఉండేవారు అలా రాజేంద్రప్రసాద్ ఆయన కలిసి అయ్యప్ప మాల వేయడం ఆపైన నేను వారితో కలిసి దీక్ష తీసుకుని వెళ్లడం చేయడం ద్వారా మరింత పరిచయం పెరిగిందని చెప్పారు మురళీమోహన్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…