సాధారణంగా ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమాను సెన్సార్ బోర్డు పర్యవేక్షించి అందులో ఏవైనా అసభ్యకర పదజాలం, అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియజేస్తుంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన తర్వాతనే ఏ సినిమా అయినా విడుదల కావాల్సి ఉంటుంది. ఇలా నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన ఒక సినిమా లోని పాట లిరిక్స్ కి సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఏంటి?ఏ పాటకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది అనే విషయానికి వస్తే..
కె రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో రోజా మూవీస్ బ్యానర్ పై ఎం అర్జున రాజు నిర్మించిన “వేటగాడు” సినిమాలో నందమూరి తారక రామారావు శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని ఎవర్ గ్రీన్ పాటగా పేరు సంపాదించిన “ఆకుచాటు పిందె తడిచే” అనే పాట ఎంతో ఫేమస్ అయ్యింది. రాఘవేంద్ర రావు వాటర్ స్పీకర్లను ఉపయోగించి మూడు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వర్షం వస్తే అందరి నోటా ఇదే పాట మేదిలేది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేసిన సెన్సార్ సభ్యులు “ఆకుచాటు పిందె తడిచే” తరువాత వచ్చే “కోకమాటు పిల్ల తడిసే” అనే పదానికి సెన్సార్ అభ్యంతరం తెలిపింది. ఆ సౌండ్ కట్ చేయాలి లేదంటే మరొక పదం అక్కడ రీప్లేస్ చేయాలని చెప్పారు. అదే సమయంలో ఏడిద నాగేశ్వరరావు ఆఫీసులో వేటూరి “శంకరాభరణం” సినిమాకు పాటలు రాస్తున్నారు.
ఈ క్రమంలోనే వేటగాడు సినిమాకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది అనే విషయం తెలుసుకున్న వేటూరి ఒక ఐదు నిమిషాల పాటు ఆలోచించి “కోకమాటు పిల్ల తడిచే” మాటల స్థానంలో కొమ్మ చాటు పువ్వు తడిసే అని మాటలు రాసి పంపించడంతో అప్పటికప్పుడు ఆ పదానికి బిట్ తో ఆ పాటను చక్రవర్తి రికార్డు చేసి పంపడంతో సెన్సార్ ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పలేదు. అలా 1979 లోవిడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయ్యింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…