General News

గర్భిణిలకు వ్యాక్సినేషన్ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం!

ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం పై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

చాలా మంది గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం వల్ల ఏదో ప్రమాదం జరగబోతుందనే అపోహలో ఉంటారు. వారిలో ఉన్న అపోహలను తొలగించి ప్రయోజనాలను వివరించాలని ఫ్రంట్లైన్ వర్కర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలకు కరోనా సోకిన ఏ ఒక్కరు కూడా ఆస్పత్రి పాలవకుండా కరోనా నుంచి బయటపడినట్లు పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కేవలం కొందరిలో మాత్రమే కరోనా సోకడం వల్ల దాని ప్రభావం గర్భస్థ పిండం పై పడిందని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన గర్భిణీ స్త్రీలలో షుగర్, ఒబిసిటీ వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇలాంటి వారికి మరింత ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గతంలో తల్లులకు కరోనా సోకిన కూడా 95 శాతం పిల్లలు సురక్షితంగా ఉన్నారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాలలో పేర్కొన్నారు.ప్రసవానికి ముందు కరోనా సోకితే ప్రసవం తర్వాత తప్పకుండా మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

44 seconds ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

38 minutes ago

మహాలక్ష్మి పథకంలో కొత్త రూల్.. స్మార్ట్ కార్డు వుండాలి మాత్రమే ఉచిత ప్రయాణం

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…

2 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

2 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

3 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

3 hours ago