ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో వేగంగా వ్యాపిస్తున్న B.1.617 కరోనా వేరియంట్ నిత్యం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే భారత్లో వ్యాపిస్తున్న అటువంటి ఈ వేరియంట్ ‘ఇండియన్ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్నట్లు ఇటీవలి కాలంలో మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి.B.1.617 అనేది ‘ఇండియన్ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని,ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేయొద్దని ఆరోగ్యశాఖ పలు మీడియా సంస్థలను హెచ్చరించింది.
తాజాగా, WHO విడుదల చేసిన 32 పేజీల డాక్యుమెంట్లో కూడా ఈ వేరియంట్ ‘ఇండియా’కు చెందినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. వైరస్ వివిధ రూపాలను అవి కనిపించిన దేశాల పేర్లతో కాకుండా, వాటిని శాస్త్రీయ నామంతో గుర్తిస్తామని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. భారతదేశంలో కనిపించినటువంటి ఈ వేరియంట్ ఇప్పటికే 44 దేశాలలో కూడా కనిపించిందని కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింద
B.1.617 వేరియంట్ తొలుత బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో గుర్తించినట్లు తెలిపింది. ఈ వేరియంట్ ఒరిజినల్ దానికన్నా ఇండియాలో వేగంగా వ్యాపించడం వల్లే దీనిని ఆందోళనకరమైన వేరియంట్ జాబితాలో చేర్చినట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఇండియాలో చేస్తున్నటువంటి ఈ వేరియంట్ ఎంతో శక్తివంతమైనదని, ఈ వేరియంట్ యాంటీబాడీస్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…