General News

సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్రం బిగ్ అలర్ట్..! డేటా భద్రతపై వెంటనే జాగ్రత్తలు తీసుకోండి

Central Governament issues big alert to social media users..!

సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నెటిజన్స్ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని భారత సైబర్ భద్రత విభాగం — ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు యాక్టివ్‌గా ఉన్నారని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన డేటా లీకయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Central Govt issues big alert to social media users..!

ఈ నేపథ్యంలో యూజర్లు తక్షణమే తమ అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించింది. పాత పాస్‌వర్డ్స్‌ను వదిలిపెట్టి, బలమైన, సురక్షితమైన పాస్‌వర్డ్స్‌ను ఉపయోగించాలని పేర్కొంది. అలాగే యూజర్ల సిస్టమ్స్‌కి, మొబైల్ ఫోన్లకి లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అన్నివిధాలా అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా సైబర్ దాడుల నుంచి రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వాడకంలో ఎక్కువగా పాల్గొంటున్న నేటి తరానికి ఈ హెచ్చరిక చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫిషింగ్, మాల్వేర్, డీప్ ఫేక్ వీడియోల ప్రభావం పెరిగిపోతున్న ఈ కాలంలో, ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

telugudesk

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago