General News

సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్రం బిగ్ అలర్ట్..! డేటా భద్రతపై వెంటనే జాగ్రత్తలు తీసుకోండి

Central Governament issues big alert to social media users..!

సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నెటిజన్స్ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని భారత సైబర్ భద్రత విభాగం — ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు యాక్టివ్‌గా ఉన్నారని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన డేటా లీకయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Central Govt issues big alert to social media users..!

ఈ నేపథ్యంలో యూజర్లు తక్షణమే తమ అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించింది. పాత పాస్‌వర్డ్స్‌ను వదిలిపెట్టి, బలమైన, సురక్షితమైన పాస్‌వర్డ్స్‌ను ఉపయోగించాలని పేర్కొంది. అలాగే యూజర్ల సిస్టమ్స్‌కి, మొబైల్ ఫోన్లకి లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అన్నివిధాలా అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా సైబర్ దాడుల నుంచి రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వాడకంలో ఎక్కువగా పాల్గొంటున్న నేటి తరానికి ఈ హెచ్చరిక చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫిషింగ్, మాల్వేర్, డీప్ ఫేక్ వీడియోల ప్రభావం పెరిగిపోతున్న ఈ కాలంలో, ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago