Featured

ప్రజలకు అలర్ట్.. కరోనా కట్టడికి కేంద్రం కొత్త నిబంధనలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వైరస్ కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ కరోనాను కట్టడి చేయడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ నెలలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాల్సిన కరోనా నిబంధనలను వెల్లడించింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తోంది.

పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్ డౌన్ ను అమలు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. కేంద్రం కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతులను ఇచ్చింది. జిల్లా యంత్రాంగం,పోలీసులు కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చేయాలని పేర్కొంది.

రాష్ట్రాలు కరోనా కేసులు పెరిగితే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వెబ్ సైట్లలో కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని.. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేసింది. ఎగ్జిబిషన్ హాళ్లు, ఈత కొలనులు, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.

50 శాతం కెపాసిటీతో థియేటర్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఉన్నవాటిపై ఆంక్షలు విధించవచ్చు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. ప్రజలు మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

12 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

14 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

21 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

21 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

22 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago