కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వైరస్ కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ కరోనాను కట్టడి చేయడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ నెలలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాల్సిన కరోనా నిబంధనలను వెల్లడించింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తోంది.
పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్ డౌన్ ను అమలు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. కేంద్రం కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతులను ఇచ్చింది. జిల్లా యంత్రాంగం,పోలీసులు కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చేయాలని పేర్కొంది.
రాష్ట్రాలు కరోనా కేసులు పెరిగితే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వెబ్ సైట్లలో కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని.. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేసింది. ఎగ్జిబిషన్ హాళ్లు, ఈత కొలనులు, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.
50 శాతం కెపాసిటీతో థియేటర్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఉన్నవాటిపై ఆంక్షలు విధించవచ్చు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. ప్రజలు మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…