Chandra Bose: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుండి టైటిల్ సాంగ్ కూడా విడుదల చేశారు . ఈ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ నవలా రచయిత మోటివేషనల్ స్పీకర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లోని లిరిక్స్ గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ కి చంద్రబోస్ రాసిన లిరిక్స్ గురించి విమర్శిస్తూ.. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ పాటలోని ” తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే వీడే ” అని పంక్తిని ఉద్దేశిస్తూ.. తిమిరం అంటే శివదూషణం కాదా ? ఇలాంటి పిచ్చి రాతలు ఎవరు రాశారు? అంటూ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు.
ఇలా ఈ పాట గురించి యండమూరి విమర్శలు చేయడంతో తాజాగా ఈ పాట రాసిన చంద్రబోస్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా చంద్రబోస్ స్పందిస్తూ.. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసా అలంకారం కింద్రకు వస్తాయని గుర్తు చేశాడు. పరస్పరం విరుద్ధమైన రెండు పదాలను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ విషయం రచయితలు అందరికీ తెలుసునని, తనకు తెలుసు కాబట్టే ఈ ప్రయోగం చేశానని క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాకుండా అసలు తిమిరంలోని నిగూఢ అర్థం తెలియని వారే అసలైన తిమిరం అంటూ యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అలాగే ఈ పాట విషయంలో ప్రముఖ రచయిత సత్యానంద్ తనకు ఫోన్ చేసి సాహిత్య పరంగా అధ్యయనం చేయవలసిన గీతమిది అంటూ తనని ప్రశంసించిన విషయం గురించి కూడా ఈ సందర్భంగా చంద్రబోస్ తెలియజేశాడు .
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…