Adusumilli Srinivasarao : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. ఇక ఏపీలో అయితే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ సభ ఏర్పాటు చేసినా అక్కడ బాగా జనం రావడం కనిపిస్తోంది. అయితే జనం రావడామేమో కానీ భద్రతా వైఫల్యమో లేక కావాలని కుట్ర చేస్తున్నారో కానీ తొక్కిసలాట జరిగి అవాంఛనీ య సంఘటనలు జరిగాయి. ఇటీవల జరిగిన కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలటలో ప్రజలు ఇబ్బందులను ఎదూర్కోవడం ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇక వీటిపై ప్రతిపక్షం ఒకలా చెబుతుంటే అధికారం పక్షం మాత్రం తన వాదన ఇంకోలా వినిపిస్తోంది. ఈ విషయాల మీద పొలిటికల్ ఎనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఆయన విశ్లేషణ అందించారు.
తొక్కిసలాట వెనుక కుట్ర…
ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సభలకు జనం స్వచ్చందంగా వస్తున్నారన్నది వాస్తవం. దాన్ని అడ్డుకోడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే చంద్రబాబు సభలకు జనం వస్తున్నారంటూ అది చూసి ఓర్వలేక ఇలాంటి వ్యూహలను వైసీపీ ప్రభుత్వం చేస్తుందంటూ తెలిపారు. చంద్రబాబు సభలకు ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు ఇలాంటి తొక్కిసలాటలు జరగడం ఏమిటి, ప్రభుత్వం తగిన విధంగా భద్రత చర్యలు తీసుకోకపోవడం అయినా జరుగుండాలి లేకపోతే కొంతమందిని సభలకు జనాలను రెచ్చగొట్టడానికే పంపి ఇలాంటి సంఘటనలు జరిగేలా ప్రోత్సాహిస్తుండాలి అంటూ చెప్పారు. గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట గురించి గ్రౌండ్ లెవెల్లో విచారించినపుడు తోఫా పంపిన అంత వరకు సవ్యంగా జరిగినా ఒక్కసారిగా ఎవరో ఇక తోఫా అయిపోతోంది చివర ఉన్నవాళ్లకు దక్కదు అంటూ వదంతులు పుట్టించేసరికి ఒక్కసారిగా తోపులట జరిగింది.
అందులోనూ అక్కడ ఉన్న కొంతమంది అక్కడి జనాలను రెచ్చగొట్టడానికి జై జగన్ అంటూ నినాదాలు కూడా చేసారు, ఇవన్నీ కావాలని కొంతమంది చేసినవని తెలిసిపోతోంది. ఇక అక్కడ పోలీసులు కనీసం 200 మంది కూడా లేరు. ఒక సీఎం సభకు 2000 మంది పోలీసులు మినిస్టర్స్ కి కూడా ఇంటి దగ్గర కాపాలకు చాలా మంది పోలీసులు ఉంటున్నారు. అలాంటప్పుడు ఒక సభ అందులోనూ అంత మంది జనం వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వంకి తెలియదా అంటూ ఆడుసుమిల్లి వాఖ్యాణించారు. కందుకూరులో తొక్కిసలాట జరిగి జనం మరణించినా మళ్ళీ గుంటూరు సభకు జనం వచ్చారంటే జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అర్థమవుతోంది అంటూ తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…