80’s ప్రారంభదశలో చిరంజీవి హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. ఆనాటి స్టార్ హీరోలను తట్టుకొని తనకంటూ ఓ కొత్త ఇమేజ్ ని సృష్టించుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఆనాటి స్టార్స్ కు దీటుగా డాన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా షిఫ్టులపై షిఫ్టులుచేస్తూ సినిమాలో రాణించడానికి విపరీతంగా కష్టపడేవారు. స్వశక్తిని నమ్ముకుని వచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు. సినిమాపై అభిమానం,కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆనాటి దర్శక నిర్మాతలను బాగా ఆకట్టుకుంది.ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ గా ఎదిగారు.
ఆ క్రమంలో 1983 ఆయన సినీకెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన ధనుంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి తమ జిల్లా వాసి, దర్శకుడు కోదండరామిరెడ్డిని మద్రాసులో కలిశారు. ఆ క్రమంలో చిరంజీవితో ఒక సినిమా తీయాలని తమ ఆలోచనను చెప్పగానే అనేక సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కోదండరామిరెడ్డి వారితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా కథ కొరకు పరుచూరి బ్రదర్స్ ను సంప్రదించగా.. ఒక ఆంగ్ల చిత్రం ఆధారంగా వారు సొంతంగా ఒక కథను తయారు చేయడం జరిగింది.
1983 సంయుక్త క్రియేషన్స్, ధనంజయరెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఖైదీ” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, సుమలత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనాటి స్టార్ హీరోలు నటించిన ముందడుగు, అడవిసింహాలు లాంటి చిత్రాలను తట్టుకొని ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “రగులుతుంది మొగలి పొద వగలమారి కన్నె ఎద.. లాంటి పాటలు ఆనాటి కుర్రకారును వెర్రెక్కించాయి. చక్రవర్తి అందించిన సంగీతానికి ప్రేక్షకులు అంత మంత్రముగ్దులయ్యారు… ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు చిరంజీవితో అనేక చిత్రాలు రూపొందించారు. ఆ క్రమంలో మగమహారాజు, మహానగరంలో మాయగాడు, మగధీరుడు లాంటి చిత్రాలనంతరం..
1988 శ్యాం ప్రసాద్ ఆర్ట్స్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 786” చిత్రం విడుదల అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కోటి స్వరపరిచిన “గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నీ గుండెలో మ్రోగిందిలే వీణ పాట.. ఈ గీతం ఆంధ్ర దేశం అంతటా ఒక ఊపు ఊపింది. చిరంజీవితో సమానంగా భానుప్రియ స్టెప్పులు ఇరగదీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత సినిమాలలో నటించడం మానేసి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ క్రమంలో.. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తానని మెగాస్టార్ ప్రకటించడం ఆయన అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది.
ఆ క్రమంలో ఆయన అనేక కథలను విన్నప్పటికీ చివరికి “కత్తి” అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ 2017 లైకా ప్రొడక్షన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా రామ్ చరణ్ నిర్మాణం, వి.వి.వినాయక్ దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 150” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. “అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు.. అనే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులను చూసి చిన్న పిల్లలు సైతం డాన్స్ చేశారు. “రత్తాలు రత్తాలు.. ఒసోసీ రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు… అనే పాటలో లక్ష్మీరాయ్ తో వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేశాయి. వి.వి.వినాయక్ దర్శకత్వం, చిరంజీవి నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాని విజయం వైపు నడిపించాయి. ఇలా ఖైదీ అనే టైటిల్ తో వచ్చిన చిరంజీవి మూడు చిత్రాలు ఉమ్మడి రాష్ట్రాల్లో వీర కుమ్ముడు కుమ్మాయనడంలో సందేహం లేదు.
మనం ప్రతిరోజు కనీసం 7–8 గంటల నిద్ర అవసరం అని వైద్యులు ఎప్పుడూ చెబుతున్నారు. సరైన నిద్ర శరీరం, మానసిక…
తారక్ అభిమానుల కోసం భారీ అప్డేట్! జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర 2’ సినిమాను తీసుకోవడం గట్టి క్రమంలో ఉంది.…
నాసా సునీతా విలియమ్స్ మిషన్ పై సంచలన నివేదిక విడుదల 8 రోజుల మిషన్… 286 రోజులు అంతరిక్షంలో భారత…
తెలంగాణలో మరో త్రివేణి సంగమం: కాళేశ్వరం సమీపంలో వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం నదుల పరిపరివాహకంలో సారవంతమైన పంటలు పండే…
సిరిసిల్లలో పులి పంజా: హైదరాబాద్ బృందం రంగంలో సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులి…
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్: అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన ఫోటోలు వైరల్ మెగా ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ…