Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని అనంతరం రాజకీయాలలోకి వెళ్లారు. అయితే రాజకీయాలలో ఈయన కొనసాగలేక తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయన ఇంటర్వ్యూలలో పాల్గొనగా ఈయనకు రాజకీయ ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.
ఇక మెగా కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు కూడా రాజకీయాలలో ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం చిరంజీవి మాత్రం రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించలేదని పరోక్షంగా ఈయన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ ఏపీకి రాజధానిగా అమరావతి కావాలని చూస్తే ఈయన మాత్రం తాను వైజాగ్ వాసినీ అవుతానని చెప్పడంతో ఈయనకు అమరావతి రాజధానిగా ఇష్టం లేదని మూడు రాజధానులకే సపోర్ట్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.అయితే ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ వైసీపీతో పోరాటం చేయడం తనకు ఏమాత్రం సంబంధం లేదని అది పూర్తిగా తన రాజకీయ జీవితం అని తెలిపారు.
ఇక తాను వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటున్నాను అంటే తనకు ఎప్పటినుంచో ఆ కోరిక ఉందని కేవలం వైజాగ్ లోనే కాకుండా గోవాలో ఊటీలో కూడా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇక వైజాగ్ లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కొన్నది వాస్తవమేనని తెలియజేశారు. వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటే అది కూడా రాజకీయం చేయడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు.అయితే తాను మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమని రాజకీయాలలో తాను ఉండలేనని మరోసారి చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన నటుల్లో శ్రీహరి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన పోషించిన పాత్రల్లో ఎంతో…
వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. పచ్చి మామిడి నుంచి పండిన మామిడి వరకు అన్ని రకాలుగా…
తెలుగు సినిమా చరిత్రలో కొత్త దారిని చూపించిన చిత్రాల్లో ‘శివ’ ఒకటి. ఈ సినిమా వెనుక జరిగిన సంఘటనలు ఇప్పటికీ…
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…
పిజ్జా అంటే చాలామందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. రుచికరమైన చీజ్, సాస్, టాపింగ్స్తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిపుణులు…