Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రమ్య తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొని తనుకు నరేష్ ఇచ్చే భరణం అవసరం లేదని తెలిపారు.
నరేష్ నుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే ఈయన మాత్రం ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని దూరం పెట్టారని తెలిపారు. అయితే నరేష్ కువిడాకులు ఇవ్వకూడదని తన కుమారుడు తనతో ఒట్టు వేయించుకున్నాడని అందుకే తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదంటూ ఈమె తెలియజేశారు.
నేను నరేష్ కు విడాకులు ఇవ్వడం కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల వరకు నాకు భరణం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు నేను ఆయన భార్యగా ఉండాలి నా కొడుకుకు తను తండ్రిగా ఉండాలని, అందుకే తాను విడాకులు ఇవ్వడం లేదు అంటూ రమ్య తెలిపారు.
ఇక నరేష్ నా కుమారుడి మెయింటెన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నెలకు 50000 చొప్పున పంపించేవారని ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని ఈ సందర్భంగా రమ్య తెలిపారు.నేను నరేష్ ఆస్తులపై ఆయన డబ్బుపై ఏమాత్రం ఆశపడలేదు. ఆయన నా కుమారుడికి తండ్రిగా ఉండాలని ఆయనకు నేను భార్యగా ఉండాలని మాత్రమే ఆశపడుతున్నాను. అందుకే ఆయనకు నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…