Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రమ్య తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొని తనుకు నరేష్ ఇచ్చే భరణం అవసరం లేదని తెలిపారు.
నరేష్ నుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే ఈయన మాత్రం ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని దూరం పెట్టారని తెలిపారు. అయితే నరేష్ కువిడాకులు ఇవ్వకూడదని తన కుమారుడు తనతో ఒట్టు వేయించుకున్నాడని అందుకే తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదంటూ ఈమె తెలియజేశారు.
నేను నరేష్ కు విడాకులు ఇవ్వడం కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల వరకు నాకు భరణం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు నేను ఆయన భార్యగా ఉండాలి నా కొడుకుకు తను తండ్రిగా ఉండాలని, అందుకే తాను విడాకులు ఇవ్వడం లేదు అంటూ రమ్య తెలిపారు.
ఇక నరేష్ నా కుమారుడి మెయింటెన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నెలకు 50000 చొప్పున పంపించేవారని ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని ఈ సందర్భంగా రమ్య తెలిపారు.నేను నరేష్ ఆస్తులపై ఆయన డబ్బుపై ఏమాత్రం ఆశపడలేదు. ఆయన నా కుమారుడికి తండ్రిగా ఉండాలని ఆయనకు నేను భార్యగా ఉండాలని మాత్రమే ఆశపడుతున్నాను. అందుకే ఆయనకు నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…