Gopichand Malineni: చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నారు. క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ మల్లినేని అనంతరం బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేశారు.
ఈ సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్, నిర్మాత ,హాని రోజ్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇలా బాలకృష్ణ చిత్రం బృందంతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య రవితేజకు ఫోన్ చేసి ధమాకా సక్సెస్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి తనదైన శైలిలో మాట్లాడుతూ ఆట పట్టించారు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ ఈయన పలు విషయాలను బయటపెట్టారు.
గోపి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్రాక్ సినిమాకి ముందు ఏడాదిన్నర పాటు చాలా కష్టాలు పడ్డావట ఆస్తులు కూడా అమ్మేశావట ఆ సమయంలో ఏమనిపించింది అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అదే సమయంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనని ఓదార్చారు. మరి క్రాక్ సినిమాకి ముందు ఏం జరిగింది? ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…