సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ సుమారు 28 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఏకంగా 272 మంది బ్రతికి బయట పడ్డారు.అసలు ఇది కలలో కూడా ఊహించని విధంగా ప్రమాదం సంభవించడంతో వారందరూ బయటపడటం నిజంగా వారందరికీ ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు.
272 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గాలిలోకి ఎగిరలేకపోయింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఒక వరి పొలాలలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 60 మంది సినీ ప్రముఖులు ఇదే ఫ్లైట్ లో ఉండడం విశేషం.
వీరందరూ చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి వెంకటేష్ విజయశాంతి అల్లురామలింగయ్య వంటి తదితర హీరోలు ఉండటం గమనార్హం. ఆ రోజు కనుక ఏమాత్రం తేడా జరిగిన ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు ఉండేవారు కాదు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…