Featured

Cine Critic Dasari Vignan : ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదురా…! సీఎం జగన్ పై కమెడియన్ పృథ్వీ రాజ్ సంచలన కామెంట్స్…: సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్

Cine Critic Dasari Vignan : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా పృథ్వీ రాజ్ ఒక వెబ్ సిరీస్ లో నటించారు. అందులో పరోక్షంగా జగన్ సర్కారు మీద పంచులు వేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి వీటి గురించి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విశ్లేషించారు.

ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదా…

‘ఎటిఎం’ అనే వెబ్ సిరీస్ లో పృథ్వీ రాజ్ నటించారు. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అందులో జగన్ సర్కారుపై పరోక్షంగా సటైర్లు వేశారు. దీని గురించి దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఈ మధ్య పాలిటిక్స్ మీద పరోక్షంగా సటైర్లు వేయడం కామన్ అయిపోయింది. సంక్రాంతి కి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో కూడా జగన్ సర్కారు మీద సటైర్లు వేసాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు కమెడియన్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి వచ్చాక ఆ పార్టీ లో ఉన్నపుడు తాను విమర్శించిన అందరికీ క్షమాపణలో చెప్పి వైసీపీ వాళ్ళను విమర్శిస్తున్నాడు. అలా ఒక ఛానెల్ లో కూడా పనిచేస్తూ ప్రభుత్వం మీద పంచులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం ఉపయోగించుకున్నాడు. అందులో కార్పొరేటర్ అవ్వాలనుకునే పృథ్వీ జగన్ పేరు గల హీరో దగ్గర పదివి ఇస్తానన్న హామీ తీసుకుని ఉంటాడు. చివరికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అతడిని కేసులో ఇరికిస్తాడు జగన్, ఆ సందర్భంలో ఒరేయ్ జగనూ నీకు మానవత్వం ఉందా అనే డైలాగని వాడారు. నిజానికి ఈ డైలాగు వినగానే అది పొలిటికల్ అని అర్థమవుతుంది అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తాజాగా విడుదల అయిన వీర సింహా రెడ్డి సినిమాకు బాగా అడ్డంకులు సృష్టించింది. థియేటర్లను తగ్గించి, టికెట్ రేట్స్ తగ్గించి బాగా ఇబ్బంది పెట్టారు.

థియేటర్స్ కూడా బాగున్నావి ఇవ్వకుండా కొంచం బాగోలేనివి ఇవ్వడం వల్ల మాస్ ఆడియన్స్ వెళ్లిపోయారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడం లేదు అలా సినిమా మీద కక్ష్య తీర్చుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు పేర్ని నాని బంధువు కావడం వల్ల సినిమాకు థియేటర్స్ విషయంలో కావాలనే అలా చేసుకున్నారు అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్లో సినిమాను ఆపవచ్చు కానీ ఓటిటి ప్లాటుఫారంలో అపలేరు కదా. ఈ సిరీస్ కూడా అంతే ట్రైలర్ లోనే జగన్ మీద పంచులున్నాయంటే ఇక సిరీస్ లో ఇతర మంత్రులు వారి మీద ఎలాంటి పంచులు ఉంటాయో చూడాలి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

7 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

7 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

7 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

8 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

10 hours ago