Featured

Cine Critic Dasari Vignan : ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదురా…! సీఎం జగన్ పై కమెడియన్ పృథ్వీ రాజ్ సంచలన కామెంట్స్…: సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్

Cine Critic Dasari Vignan : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా పృథ్వీ రాజ్ ఒక వెబ్ సిరీస్ లో నటించారు. అందులో పరోక్షంగా జగన్ సర్కారు మీద పంచులు వేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి వీటి గురించి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విశ్లేషించారు.

ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదా…

‘ఎటిఎం’ అనే వెబ్ సిరీస్ లో పృథ్వీ రాజ్ నటించారు. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అందులో జగన్ సర్కారుపై పరోక్షంగా సటైర్లు వేశారు. దీని గురించి దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఈ మధ్య పాలిటిక్స్ మీద పరోక్షంగా సటైర్లు వేయడం కామన్ అయిపోయింది. సంక్రాంతి కి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో కూడా జగన్ సర్కారు మీద సటైర్లు వేసాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు కమెడియన్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి వచ్చాక ఆ పార్టీ లో ఉన్నపుడు తాను విమర్శించిన అందరికీ క్షమాపణలో చెప్పి వైసీపీ వాళ్ళను విమర్శిస్తున్నాడు. అలా ఒక ఛానెల్ లో కూడా పనిచేస్తూ ప్రభుత్వం మీద పంచులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం ఉపయోగించుకున్నాడు. అందులో కార్పొరేటర్ అవ్వాలనుకునే పృథ్వీ జగన్ పేరు గల హీరో దగ్గర పదివి ఇస్తానన్న హామీ తీసుకుని ఉంటాడు. చివరికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అతడిని కేసులో ఇరికిస్తాడు జగన్, ఆ సందర్భంలో ఒరేయ్ జగనూ నీకు మానవత్వం ఉందా అనే డైలాగని వాడారు. నిజానికి ఈ డైలాగు వినగానే అది పొలిటికల్ అని అర్థమవుతుంది అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తాజాగా విడుదల అయిన వీర సింహా రెడ్డి సినిమాకు బాగా అడ్డంకులు సృష్టించింది. థియేటర్లను తగ్గించి, టికెట్ రేట్స్ తగ్గించి బాగా ఇబ్బంది పెట్టారు.

థియేటర్స్ కూడా బాగున్నావి ఇవ్వకుండా కొంచం బాగోలేనివి ఇవ్వడం వల్ల మాస్ ఆడియన్స్ వెళ్లిపోయారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడం లేదు అలా సినిమా మీద కక్ష్య తీర్చుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు పేర్ని నాని బంధువు కావడం వల్ల సినిమాకు థియేటర్స్ విషయంలో కావాలనే అలా చేసుకున్నారు అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్లో సినిమాను ఆపవచ్చు కానీ ఓటిటి ప్లాటుఫారంలో అపలేరు కదా. ఈ సిరీస్ కూడా అంతే ట్రైలర్ లోనే జగన్ మీద పంచులున్నాయంటే ఇక సిరీస్ లో ఇతర మంత్రులు వారి మీద ఎలాంటి పంచులు ఉంటాయో చూడాలి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago