Featured

Cine Critic Dasari Vignan : ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదురా…! సీఎం జగన్ పై కమెడియన్ పృథ్వీ రాజ్ సంచలన కామెంట్స్…: సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్

Cine Critic Dasari Vignan : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా పృథ్వీ రాజ్ ఒక వెబ్ సిరీస్ లో నటించారు. అందులో పరోక్షంగా జగన్ సర్కారు మీద పంచులు వేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి వీటి గురించి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విశ్లేషించారు.

ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదా…

‘ఎటిఎం’ అనే వెబ్ సిరీస్ లో పృథ్వీ రాజ్ నటించారు. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అందులో జగన్ సర్కారుపై పరోక్షంగా సటైర్లు వేశారు. దీని గురించి దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఈ మధ్య పాలిటిక్స్ మీద పరోక్షంగా సటైర్లు వేయడం కామన్ అయిపోయింది. సంక్రాంతి కి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో కూడా జగన్ సర్కారు మీద సటైర్లు వేసాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు కమెడియన్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి వచ్చాక ఆ పార్టీ లో ఉన్నపుడు తాను విమర్శించిన అందరికీ క్షమాపణలో చెప్పి వైసీపీ వాళ్ళను విమర్శిస్తున్నాడు. అలా ఒక ఛానెల్ లో కూడా పనిచేస్తూ ప్రభుత్వం మీద పంచులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం ఉపయోగించుకున్నాడు. అందులో కార్పొరేటర్ అవ్వాలనుకునే పృథ్వీ జగన్ పేరు గల హీరో దగ్గర పదివి ఇస్తానన్న హామీ తీసుకుని ఉంటాడు. చివరికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అతడిని కేసులో ఇరికిస్తాడు జగన్, ఆ సందర్భంలో ఒరేయ్ జగనూ నీకు మానవత్వం ఉందా అనే డైలాగని వాడారు. నిజానికి ఈ డైలాగు వినగానే అది పొలిటికల్ అని అర్థమవుతుంది అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తాజాగా విడుదల అయిన వీర సింహా రెడ్డి సినిమాకు బాగా అడ్డంకులు సృష్టించింది. థియేటర్లను తగ్గించి, టికెట్ రేట్స్ తగ్గించి బాగా ఇబ్బంది పెట్టారు.

థియేటర్స్ కూడా బాగున్నావి ఇవ్వకుండా కొంచం బాగోలేనివి ఇవ్వడం వల్ల మాస్ ఆడియన్స్ వెళ్లిపోయారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడం లేదు అలా సినిమా మీద కక్ష్య తీర్చుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు పేర్ని నాని బంధువు కావడం వల్ల సినిమాకు థియేటర్స్ విషయంలో కావాలనే అలా చేసుకున్నారు అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్లో సినిమాను ఆపవచ్చు కానీ ఓటిటి ప్లాటుఫారంలో అపలేరు కదా. ఈ సిరీస్ కూడా అంతే ట్రైలర్ లోనే జగన్ మీద పంచులున్నాయంటే ఇక సిరీస్ లో ఇతర మంత్రులు వారి మీద ఎలాంటి పంచులు ఉంటాయో చూడాలి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago