Sarkaru Vaari Paata:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాని అభిమానుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వీక్షించి సినిమాపై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేష్ సర్కారు వారి పాట సినిమా పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించి ట్వీట్ చేయగా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోని సినిమా చూసిన అనంతరం జగన్ సతీమణి భారతి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో భారతి మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని తెలియజేశారు. తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని తప్పకుండా అతని సినిమాలు చూస్తానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు నటన ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది అంటూ భారతి ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని భారతి తెలియజేశారు. అయితే గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ ఉపయోగించి ఎన్నికలలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో కూడా ఈ డైలాగ్ పెట్టడంతో సినిమాకు మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…