Sarkaru Vaari Paata:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాని అభిమానుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వీక్షించి సినిమాపై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేష్ సర్కారు వారి పాట సినిమా పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించి ట్వీట్ చేయగా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోని సినిమా చూసిన అనంతరం జగన్ సతీమణి భారతి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో భారతి మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని తెలియజేశారు. తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని తప్పకుండా అతని సినిమాలు చూస్తానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు నటన ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది అంటూ భారతి ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని భారతి తెలియజేశారు. అయితే గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ ఉపయోగించి ఎన్నికలలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో కూడా ఈ డైలాగ్ పెట్టడంతో సినిమాకు మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…