CM Jagan Mohan Reddy : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకు విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు సొంతంగా ఆలోచించలేదు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ మీద ఆయన అనునయాల మీద విమర్శలను ఎక్కుపెట్టారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు కనిపించవా…
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశం ఖచ్చితంగా చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ లు, ప్రతినిధులు ప్రతి ఇంటికి వచ్చి ఆ మేనిఫెస్టో తీసుకొని చేసిన పనులను టిక్ చేయమని అడుగుతున్నారు అది మా నిబద్ధత అంటూ తెలిపారు.
జగనన్న రాసిన ఉత్తరంలో చేసిన ప్రజా కార్యక్రమాలను టిక్ చేసి ప్రజల ఆమోదం తీసుకుంటున్నా ఇంకా మాపై దత్త పుత్రుడు విమర్శలు చేస్తున్నారని, గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో లో ఆ దత్త పుత్రుడి బొమ్మ కూడా ఉందని, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో లో ఎన్ని పథకాలు అమలు చేశారో ఏనాడూ ఎందుకు దత్తపుత్రుడు విమర్శించలేదంటూ అడిగారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఏక కాలంలో విమర్శలను గుప్పించారు సీఎం జగన్.
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్లో బిజీగా…
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…