CM Jagan Mohan Reddy : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకు విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు సొంతంగా ఆలోచించలేదు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ మీద ఆయన అనునయాల మీద విమర్శలను ఎక్కుపెట్టారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు కనిపించవా…
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశం ఖచ్చితంగా చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ లు, ప్రతినిధులు ప్రతి ఇంటికి వచ్చి ఆ మేనిఫెస్టో తీసుకొని చేసిన పనులను టిక్ చేయమని అడుగుతున్నారు అది మా నిబద్ధత అంటూ తెలిపారు.
జగనన్న రాసిన ఉత్తరంలో చేసిన ప్రజా కార్యక్రమాలను టిక్ చేసి ప్రజల ఆమోదం తీసుకుంటున్నా ఇంకా మాపై దత్త పుత్రుడు విమర్శలు చేస్తున్నారని, గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో లో ఆ దత్త పుత్రుడి బొమ్మ కూడా ఉందని, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో లో ఎన్ని పథకాలు అమలు చేశారో ఏనాడూ ఎందుకు దత్తపుత్రుడు విమర్శించలేదంటూ అడిగారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఏక కాలంలో విమర్శలను గుప్పించారు సీఎం జగన్.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…